E-Paper
Advertisement

BCCI: మీరు ఎంత గింజుకున్నా, గంభీర్ ను తొల‌గించేది లేదు.. 2027 వ‌ర‌కే అత‌డే !

BCCI: మీరు ఎంత గింజుకున్నా, గంభీర్ ను తొల‌గించేది లేదు.. 2027 వ‌ర‌కే అత‌డే !

BCCI : దక్షిణాఫ్రికా చేతులో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయిన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వెంటనే గౌతమ్ గంభీర్ ను తొలగించాలని టీమిండియా అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) తప్పుడు నిర్ణయాల వల్ల సొంత గడ్డపై కూడా టీమిండియా ఓడిపోతుందని విమర్శలు చేస్తున్నారు. వెంటనే అతని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తను నియామకం చేయాలని కోరుతున్నారు. అయితే సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ పై వస్తున్న వ్యతిరేకతపై తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. ఎవరెంత గింజుకున్నా గౌతమ్ గంభీర్ కోచ్ కొనసాగుతాడని వెల్లడించింది బీసీసీఐ ( BCCI).

Also Read: Gambhir: ఆసియా, చాంపియన్స్ ట్రోఫీ నేనే తీసుకువచ్చా.. దక్షిణాఫ్రికాతో ఓటమికి టీమిండియా ప్లేయర్లే కారణం, నా తప్పేం లేదు

గంభీర్ పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండదు

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ను తొలగిస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అటు గౌత‌మ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తన భవిష్యత్తు మొత్తం బీసీసీఐ చేతిలో ఉందని, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్న తనకు ఓకే అంటూ గంభీర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గౌత‌మ్ గంభీర్ వ్యాఖ్యలపై స్పందించింది బీసీసీఐ. గౌతమ్ గంభీర్ పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండబోదని వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం టీమిండియా జట్టు మార్పుల దశలో ఉందని వెల్లడించారు. అయితే రెండు కోచ్ మార్పు మాత్రం ఉండకూడదని ఆయన సంకేతాలు ఇచ్చారు. 2027 వరకు దాదాపు గౌతమ్ గంభీర్ ఉంటాడని పరోక్షంగా హిట్ ఇచ్చారు స‌దరు బీసీసీఐ అధికారి.

2027 వ‌ర‌కూ గంభీర్ కొన‌సాగింపు.. బీసీసీఐ షాకింగ్ నిర్ణ‌యం

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను తొలగించి కొత్త కోచ్ ను నియామకం చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం దీనిపై వెనక్కి అడుగు వేసే సమస్య లేనట్లే వ్యవహరిస్తోంది. 2027 వరకు గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ లాంటి సెలక్షన్ కమిటీని కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 2027 తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి, మార్పుపై నిర్ణయం తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. నిజంగానే గౌతమ్ గంభీర్ ను తొలగిస్తే వివిఎస్ లక్ష్మణ్ కు అవకాశం ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది మహేంద్ర సింగ్ ధోనీకి హెడ్ కోచ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు. చివరికి రవి శాస్త్రికి అయినా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. వాళ్ల ఆధ్వర్యంలోనే మళ్లీ టీమిండియా గాడిలో పడుతుందని అంటున్నారు.

Also Read:  WTC 2025-27 points table: WTC పాయింట్ల పట్టికలో టీమిండియాకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్.. మనోళ్లను వెనక్కి నెట్టిన శత్రుదేశం

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×