Ganguly Comments On Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్ర సింగ్ ధోని.. ఆ తర్వాత టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు దక్కించుకున్నాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ (Ganguly) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వల్లే టీమిండియాలోకి మహేంద్ర సింగ్ ధోని వచ్చాడని బాంబు పేల్చారు. తానే లేకపోతే, మహేంద్ర సింగ్ ధోని పల్లీలు, బఠానీలు అమ్ముకునేవాడు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. దీంతో బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ (Ganguly) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మహేంద్ర సింగ్ ధోని గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. 2004లో మహేంద్రసింగ్ ధోని టీమిండియా-ఏ జట్టు తరఫున వాంఖడే స్టేడియంలో ఆడుతూ కొట్టిన సిక్సర్లు చూసి… సభా కరీం తనకు సమాచారం ఇచ్చినట్లు గుర్తు చేశారు సౌరవ్ గంగూలీ. అసాధారణమైన ప్రతిభ గల ఆటగాళ్లను దేశవాళి క్రికెట్ లో ఎక్కువ కాలం ఉంచకూడదని.. తాను అప్పుడే డిసైడ్ అయ్యానని ఆయన వెల్లడించారు సౌరవ్ గంగూలీ.
ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని వెంటనే టీమిండియాలోకి తీసుకురావాలని బీసీసీఐకి కూడా తాను సూచనలు చేసినట్లు వివరించారు. ఇక ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని… మొదట్లో విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత క్లిక్ అయినట్లు వివరించారు. జార్ఖండ్ నుంచి వచ్చిన ఏ ఒక్క క్రికెటర్ ఈ స్థాయికి ఎదగలేదని స్పష్టం చేశారు.
మహేంద్ర సింగ్ ధోని కొట్టే సిక్సర్ల గురించి అటు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని కెరీర్ ప్రారంభంలో సిక్సర్లు బాదిన విధానమే తనకు ఇష్టమని వివరించారు. కెరీర్ చివరి దశలో ధోని ఎక్కువగా సింగిల్స్ తీస్తూ అనడం తనకు అంతగా నచ్చలేదని కూడా వెల్లడించారు. అతని సహజ సిద్ధమైన దూకుడు ఆటతీరే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సౌరవ్ గంగూలీ. పాకిస్తాన్ వాళ్లు కూడా మహేంద్రసింగ్ ధోని కొట్టే సిక్సర్ లను ఎంజాయ్ చేస్తారని ప్రశంసించారు.