Robin Uthappa On MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సంవత్సరంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రుడు.. టీమిండియా ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోనీపై రాబిన్ ఉతప్ప ( Robin Uthappa) షాకింగ్ కామెంట్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని వల్ల టీమిండియా ఈ స్థాయికి వచ్చిందని.. ప్రశంసించారు. ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాలను చేశాడని రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా బాల్ ఔట్ ఆడాల్సి వస్తే, పాకిస్తాన్ ను తెలివిగా ధోని బోల్తా కొట్టించాడని వెల్లడించారు. అతని వల్లే టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్ దక్కిందన్నారు.
2007 టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజిలో టీవి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ కాకుండా ఫుట్బాల్ తరహాలో పెనాల్టీ షూట్ అవుట్ లాంటి బాల్ అవుట్ నిర్వహించారు. ఈ క్రమంలో బాల్ ఔట్ గురించి రాబిన్ ఉతప్ప ( Robin Uthappa) షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని కారణంగానే ఈ బాల్ ఔట్ లో టీమిండియా గెలిచిందని తెలిపారు. పాకిస్తాన్ కంటే తెలివిగా ధోని ఆలోచించి వాళ్ళని ఓడించాడని పేర్కొన్నారు.
ఈ మ్యాచ్ లో ఒత్తిడి ఉన్నప్పటికీ ధోని తన తెలివి ప్రదర్శించాడని ప్రశంసించారు. జట్టులో ప్రధాన బౌలర్లు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. పార్ట్ టైం బౌలర్ అయిన తనను ధోని బౌలింగ్ చేయించాడని గుర్తు చేశారు. బాల్ అవుట్ సమయంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వికెట్లకు దూరంగా సాధారణ స్థానంలో నిలబడ్డాడు. కానీ మహేంద్ర సింగ్ ధోని అలా కాకుండా చాలా తెలివిగా వికెట్ల వెనకాల మోకాలపై కూర్చున్నాడని గుర్తు చేశారు. దీనివల్ల బౌలర్లకు వికెట్ల లైన్ అర్థం చేసుకోవడం చాలా సులభం అయిందని వివరించారు. దీని కారణంగా పాకిస్తాన్ పై 3-0 తేడాతో గెలిచినట్లు గుర్తు చేశారు.
టీ20 2027 వరల్డ్ కప్ సమయంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ డ్రా అయిన నేపథ్యంలో ఈ బాల్ అవుట్ నిర్వహించారు. వాస్తవానికి ఫుట్బాల్ లో పెనాల్టీ షూట్ అవుట్ కింద దీని నిర్వహిస్తారు. అచ్చం అలాగే… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం కూడా వాడారు.