Abhishek Sharma: టీమిడియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం టి20 జరిగిన సంగతి తెలిసిందే. గౌహతి వేదికగా జరిగిన ఈ మూడవ టి20 లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఊచకోత కోశాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. సిక్సర్లు, బౌండరీలు బాది న్యూజిలాండ్ కు నరకం చూపించాడు. ఈ మ్యాచ్ లో 340 స్ట్రైక్ రేటుతో న్యూజిలాండ్ బౌలర్లు గుండెలు బాదుకునేలా చేశాడు. ఈ దెబ్బకు 10 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది టీమిండియా. అయితే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత అభిషేక్ శర్మ బ్యాట్ ను న్యూజిలాండ్ ప్లేయర్లు ( New Zealand players ) చెక్ చేశారు. బ్యాట్ లో బ్యాట్ లో ( Abhishek Sharma bat )స్ప్రింగులు పెట్టాడా ? అంటూ అభిషేక్ శర్మను అనుమానించారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.
గౌహతి వేదికగా జరిగిన మూడవ టి20లో శివతాండవం చేశాడు అభిషేక్ శర్మ. 154 పరుగుల లక్ష్యాన్ని ఊది పారేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ 20 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు అలాగే ఏడు బౌండరీలు ఉన్నాయి. 340 స్ట్రైక్ రేటుతో తన ప్రతాపం చూపించాడు అభిషేక్ శర్మ. ఓపెనర్ గా బరిలోకి దిగి 300 కు పైగా స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక బ్యాటర్ గా అభిషేక్ శర్మ రికార్డు కూడా సృష్టించాడు. అదే సమయంలో యువరాజ్ సింగ్ తర్వాత 14 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన వీరుడిగా చరిత్ర సృష్టించాడు.
తన గురువు రికార్డు పైనే కన్నేశాడు ఈ డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత అభిషేక్ శర్మ పై అనుమానం వ్యక్తం చేశారు న్యూజిలాండ్ క్రికెటర్లు. న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్, కాన్వే, ఇతర ప్లేయర్లందరూ అభిషేక్ శర్మ బ్యాట్ తీసుకొని చెక్ చేశారు. ఇందులో స్ప్రింగులు పెట్టాడా? లేక ఇంకేదైనా మ్యాజిక్ చేశాడా ? అంటూ న్యూజిలాండ్ క్రికెటర్లు ఆరా తీసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
మూడవ టి20 మ్యాచ్ లో 10 ఓవర్ లోనే మ్యాచ్ ఫినిష్ చేసింది టీం ఇండియా. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్స్ లో 153 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని అభిషేక్ శర్మ అలాగే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఊది పరేశారు. దీంతో 10 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి టీమిండియా గెలిచింది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==