BigTV English

Preity Zinta: శ్రేయస్ ను కాదని వైభవ్ కు ప్రీతీ జింటా హాగ్.. 14 ఏళ్ళ కుర్రాడితో ఏంటి అరాచకం ?

Preity Zinta: శ్రేయస్ ను కాదని వైభవ్ కు ప్రీతీ జింటా హాగ్.. 14 ఏళ్ళ కుర్రాడితో ఏంటి అరాచకం ?

Preity Zinta:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్… నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో… పంజాబ్ కింగ్స్ దుమ్ము లేపుతోంది. ఈ దెబ్బకు ఈసారి ప్లే ఆఫ్ కి కూడా వెళ్ళింది పంజాబ్ కింగ్స్. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ప్లే ఆఫ్ కు వెళ్ళింది పంజాబ్ కింగ్స్. దీని అంతటికి కారణం కొత్తగా వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అయితే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్న పంజాబ్ కింగ్స్ సహా ఓనర్ ప్రీతి జింటా కూడా… అతన్ని నిత్యం పొగుడుతూనే ఉంది. వెనుక ఉండి అతనిని నడిపిస్తుంది. బాగా ఆడినప్పుడు… శ్రేయస్ అయ్యర్ కు హగ్గులు కూడా ఇస్తోంది.


 

మ్యాచ్ గెలిస్తే చాలు హగ్గులే హగ్గులు


ఐపీఎల్ టోర్నమెంట్లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేయర్లకు మరొక జట్టు ప్లేయర్లకు ఉండదు. ఎందుకంటే ఐపీఎల్ లో మ్యాచ్ గెలిస్తే చాలు…. ప్రీతి జింటా.. తమ జట్టు ప్లేయర్లకు హగ్గులు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒక మ్యాచ్ లో అద్భుతంగా ఆడి గెలిపిస్తే… వాళ్లకు… ఆరోజు హగ్గులే హగ్గులు. స్టేడియంలోనే హక్కులు ఇచ్చి వాళ్ళని చంపేస్తుంది. ఆ హగ్గుల కోసమైనా చాలా మంది క్రికెటర్లు… పంజాబ్ కింగ్స్ ను.. గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో… శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ కు ఇప్పటికే చాలాసార్లు హగ్గులు ఇచ్చింది ప్రీతి జింటా.

14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి ప్రీతి హగ్గులు

ఆదివారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్.. విజయం సాధించి ఈ ప్లే ఆఫ్ కు వెళ్ళింది. దీంతో 11 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్ వెళ్లిన జట్టుగా రికార్డు లోకి ఎక్కింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్ అనంతరం… తన ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ ప్లేయర్ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా హగ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో శ్రేయస్ అయ్యర్ ఆగ్రహంగా ఉన్నాడని కూడా వైరల్ చేస్తున్నారు. ప్రీతి జింటా తనదని… తనకు మాత్రమే హక్కులు ఇవ్వాలని శ్రేయస్ అయ్యర్ రగిలిపోతున్నట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే వాస్తవానికి 14 ఏళ్ల సూర్య వంశీకి ప్రీతి జింటా ఆదివారం రోజున హగ్గు ఇవ్వలేదు. కానీ కొంతమంది కావాలని హగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వ్యూస్ కోసం ఈ పని చేసినట్టు తెలుస్తోంది.

చివర్లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్

ఆదివారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. పంజాబ్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది రాజస్థాన్ రాయల్స్. ఇక ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ఆడి 5 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 209 పరుగులు మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ పైన పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×