Shashank Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… తాజాగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో.. అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో పాయింట్లో పట్టికలో మొదటి స్థానానికి దూసుకు వెళ్ళింది పంజాబ్ కింగ్స్. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కంటే ముందు అతను చెప్పిన మాటలే నిజమయ్యాయి.
Also Read : Kohli – Anushka Sharma : కోహ్లీకి అవమానం.. అనుష్క శర్మ ప్రైవేట్ పార్ట్స్ పై ట్రోలింగ్ !
చెప్పి మరీ కొట్టిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా సోమవారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సేన అద్భుతంగా రాణించింది. దింతో ముంబై ఇండియన్స్ పైన కీలకమైన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పంజాబ్ కింగ్స్. అయితే… ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ పోడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ టాప్ 2 లో ఉంటుందని ప్రకటించాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్.. కంటే ముందు నేను చెబుతున్న.. మేం కచ్చితంగా టాప్ 2 లో నిలువ బోతున్నాం. రాసి పెట్టుకోండి. నా వ్యాఖ్యలను పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన తర్వాత కూడా ప్లే చేయండి. ఈ విషయంలో నేను వెనక్కి… తగ్గబోను అని ప్రకటించాడు శశాంక్ సింగ్. ఇక అతను చెప్పినట్లుగానే ముంబై ఇండియన్స్ జట్టును పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. నేరుగా నెంబర్ వన్ పొజిషన్ కు వెళ్ళింది పంజాబ్ కింగ్స్. ఇవాల్టి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో రాయల్ చాలెంజర్స్ గెలిచినా కూడా పెద్ద సమస్య ఉండదు. ఒకవేళ రాయల్ చాలెంజ్ బెంగుళూరు విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు మధ్య… తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫైయర్ ఉంటుంది. ఏది జరిగిన పంజాబ్ కింగ్స్ మాత్రం సేఫ్.
ముంబై ని చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
సోమవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణించి… ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది. ఇక చేజింగ్ లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్… ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది.
And PBKS are now in the top two of the table. 🤯 pic.twitter.com/eXXyqBs65e
— Out Of Context Cricket (@GemsOfCricket) May 26, 2025