BigTV English
Advertisement

South Africa Beats India : సఫారీలతో పోరాడి ఓడిన టీమిండియా!

South Africa Beats India : సఫారీలతో పోరాడి ఓడిన టీమిండియా!

T20c లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది… రోహిత్ సేన. లో స్కోరింగ్ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ దాకా పోరాడినా… భారత్ కు విజయం దక్కలేదు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు… సౌతాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. పేస్ కు అనుకూలించే పిచ్ పై చెలరేగిపోయిన సఫారీ సీమర్లు… స్కోరు 50 పరుగులకు కూడా చేరకముందే… ఐదుగురు టాపార్డర్ బ్యాటర్లను ఔట్ చేశారు. అందులో లుంగి ఎంగిడికే నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. 19వ ఓవర్ దాకా సఫారీ బౌలర్లను ఎదుర్కొని హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో 68 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 40 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు… సూర్యకుమార్ యాదవ్. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది… టీమిండియా.

134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను… భారత బౌలర్లు కూడా బెంబేలెత్తించారు. రెండో ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్… తొలిబంతికే డికాక్ ను ఔట్ చేశాడు. మూడో బంతికి… బంగ్లాదేశ్ పై సూపర్ సెంచరీ చేసిన రూసోను కూడా డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. 3 పరుగులకే 2 వికెట్లు పడటంతో… ఆచితూచి ఆడారు… సౌతాఫ్రికా బ్యాటర్లు. ఆరో ఓవర్లో కెప్టెన్ బవుమాను షమి ఔట్ చేశాడు అప్పటికి సౌతాఫ్రికా స్కోరు 24 పరుగులే. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో… మార్ క్రమ్, మిల్లర్ జాగ్రత్తగా ఆడారు. దాంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి సౌతాఫ్రికా 40 పరుగులే చేయగలిగింది. భారత్ 10 ఓవర్లలో 60 రన్స్ చేయడం… సౌతాఫ్రికా 40 రన్సే చేయడంతో… విజయంపై భారత అభిమానుల్లో ఆశలు చిగురించాయి. కానీ… డ్రింక్స్ పూర్తైన వెంటనే 11వ ఓవర్ నుంచి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు… మార్ క్రమ్, మిల్లర్. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేశారు. అయినా చివరి ఓవర్ దాకా పట్టువిడవకుండా పోరాడింది… భారత్. చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా… తొలి బంతికి పరుగేమీ రాలేదు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. దాంతో… 4 బంతుల్లో సౌతాఫ్రికా విజయానికి 4 పరుగులు కావాల్సి వచ్చాయి. తర్వాతి రెండు బంతుల్లోని మిల్లర్ ఫోర్లు బాదడంతో… 5 వికెట్ల తేడాతో భారత్ పై నెగ్గింది… సౌతాఫ్రికా. 4 వికెట్లు తీసి భారత్ ను దెబ్బకొట్టిన లుంగి ఎంగిడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


Related News

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Big Stories

×