BigTV English
Advertisement

Pakisthan Blast : క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Pakisthan Blast :  క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Pakisthan Blast :  సాధార‌ణంగా క్రికెట్ లో ర‌క‌ర‌కాల సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. ఇటీవ‌లే కెన‌డాలోని కింగ్ సిటీలో జ‌రిగిన ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లీగ్ 2 మ్యాచ్ లో న‌మీబియా, స్కాట్లాండ్ జ‌ట్ల మ‌ధ్య వింత సంఘ‌ట‌న జ‌రిగింది. వ‌ర్షం త‌రువాత గ్రౌండ్ సిబ్బంది పిచ్ పై నిప్పు పెట్టారు. అయితే ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే తాజాగా పాకిస్తాన్ లో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే గ్రౌండ్ లో పేలుడు సంభ‌వించింది. అది మ‌ళ్లీ పాకిస్తాన్ లో జ‌ర‌గ‌డంతో ఉగ్ర‌వాదులు పేల్చారా..? ఇది తాలిబ‌న్లా… అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రోవైపు గ్రౌండ్ లో క్రికెట్ ఆడేవారు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇది జ‌రిగింది నేష‌న‌ల్ మ్యాచ్ మాత్రం కాదు. పాకిస్తాన్ లో ఓ టోర్న‌మెంట్ లో జ‌రిగినట్టు స‌మాచారం. అది గ‌ల్లీ క్రికెట్ టోర్న‌మెంట్ అని తెలుస్తోంది. పాకిస్తాన్ లో మ్యాచ్ ల్లో గ‌ల్లీ క్రికెట్ లోనే ఇలా జ‌రిగితే మ‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ లో ఇంకెలా జ‌రుగుతుందోన‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.


Also Read : Asia Cup 2025 jersey : టీమిండియా న్యూ జెర్సీ వచ్చేసింది… జెర్సీ లేకుండానే.. ఫోటోలు చూసేయండి

క్రికిట్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా పేలుడు.. వ్య‌క్తి మృతి

పాకిస్తాన్ ఖైబ‌ర్ ప‌ఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో క్రికిట్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ఉన్న‌ట్టుంది భారీ పేలుడు సంభ‌వించ‌డంతో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. చాలా మందికి తీవ్ర గాయాలైన‌ట్టు స‌మాచారం. బ‌జార్ జిల్లాలోని ఖ‌ర్ తెహ‌సిల్ లోని కౌస‌ర్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ పేలుడు సంభ‌వించింది. ప‌లు మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. బ‌జార్ జిల్లా పోలీస్ అధికారి ర‌ఫిక్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ ద్వారా పేలుడు చోటు చేసుకున్న‌ట్టు ధృవీకరించారు. పాకిస్తాన్ లో క్రికెట్ గ్రౌండ్ లో పేలుడు సంభ‌వించి ఒక వ్య‌క్తి మ‌ర‌ణించ‌గా.. ప‌లువురు పిల్ల‌లు, పెద్ద‌లు గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆసుప‌త్రిలో చేర్పించిన‌ట్టు వెల్ల‌డించారు పోల‌స్ అధికారి. ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ ప్ర‌కారం.. పేలుడు జ‌రిగిన వెంట‌నే మైదానంలో గంద‌ర‌గోళం నెల‌కొంది.


ప‌రుగులు పెట్టిన ప్ర‌జ‌లు

ముఖ్యంగా అక్క‌డున్న ప్ర‌జ‌లు త‌మ ప్రాణాల‌ను ర‌క్షించుకునేందుకు ప‌రుగులు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇది స్థానిక ఆట‌గాళ్లు క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో ఈ పేలుడు సంభ‌వించింది. ఈ దాడి జ‌రిగిన త‌రువాత దుండుగులు ఓ పోలీస్ స్టేష‌న్ ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ వారి దాడి విఫ‌లమైంద‌ని పోలీస్ అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ దాడి ఎవ్వ‌రూ చేశార‌నేది ఏ సంస్థ కూడా బాధ్య‌త వ‌హించ‌లేదు. ఈ పేలుడు వ‌ల్ల చాలా మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. దీంతో మృతుల‌ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ లో ఖైబ‌ర్ పఖ్తుంఖ్వాలోని ఉత్త‌ర వ‌జీరిస్తాన్ లో ఖ‌డ్డీ ప్రాంతం స‌మీపంలో సైనికుల కాన్వాయ్ ను ల‌క్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి చేయ‌డంతో 13 మంది పాక్ సైనికులు మ‌ర‌ణించారు. అందులో కొంత మంది గాయ‌ప‌డ్డారు. ఇత్తేహాద్ ఉల్ ముజాహిదీన్ పాకిస్తాన్ తో అనుబంధంగా ఉన్న ఉగ్ర‌వాద సంస్థ అస్వాద్ ఉల్ హ‌ర్బ్ గ్రూప్ ఈ దాడికి బాధ్య‌త వ‌హించింది.

Related News

Asia Cup 2025: టీమిండియా ప్లేయ‌ర్లు టెర్ర‌రిస్టులు…అందుకే ట్రోఫీ ఇవ్వ‌లేదు..!

Asia Cup 2025: మోహ్సిన్ నఖ్వీ దొంగ‌బుద్ది..ఆ ర‌హ‌స్య ప్ర‌దేశంలో ఆసియా క‌ప్ దాచేసి, కుట్ర‌లు

Gautam Gambhir: గిల్ కు షాక్‌.. త‌న‌పైకి విమ‌ర్శ‌లు రాకుండా గంభీర్ స్కెచ్‌.. ఏకంగా రూ. 49 కోట్లు పెట్టి !

Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ షెడ్యూల్ ఖ‌రారు..ఆ జ‌ట్టుతోనే టీమిండియాకు మ్యాచ్‌..పూర్తి వివ‌రాలు

Hardik Pandya: పిన్నితో నటషా కొడుకు…గాయం పేరుతో బీసీసీఐని మోసం చేస్తున్న హార్దిక్ పాండ్య

Simon Harmer: పాకిస్తాన్ ఓ అందమైన దేశం, అక్క‌డ ఉగ్ర‌వాదులే లేరు…స‌న్ రైజ‌ర్స్ ప్లేయ‌ర్‌ షాకింగ్ కామెంట్స్‌!

Gautam Gambhir: కుల్దీప్ ఏం త‌ప్పు చేశాడు..ఓట‌మికి మూల‌ కార‌ణం గంభీరే, టీమిండియా 5 సిరీస్ లు గోవిందా

Yuzvendra Chahal: విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌కు భ‌ర‌ణం ఇవ్వొద్దు… చాహ‌ల్ సంచ‌ల‌నం పోస్ట్‌

Big Stories

×