BigTV English

Tirupati crime: బిడ్డ భారమనుకున్న తల్లి.. మురికి కాలువలో విసిరేసింది!

Tirupati crime: బిడ్డ భారమనుకున్న తల్లి.. మురికి కాలువలో విసిరేసింది!
Advertisement

Tirupati crime: తిరుపతిలో చోటుచేసుకున్న ఓ విషాదకర సంఘటన అందరినీ కలచివేసింది. కొరమీనుగుంటలో నివసించే చిన్నారి రమ్య కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రాత్రంతా వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తెల్లవారుజామున రమ్య కనిపించలేదని, పక్కనే ఉన్న మురికికాల్వలో పడి మృతి చెందినట్లుందని ఆమె తల్లి పోలీసులకు తెలిపింది. అయితే ఈ విషయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసి, మృతదేహం కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.


ఉదయం మొదలుకొని 3 రెస్క్యూ టీమ్‌లు మురికికాల్వలో గాలించాయి. అదనంగా అదనపు ఎస్పీ, తిరుపతి డీఎస్పీ సైతం స్వయంగా వచ్చి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఎట్టకేలకు రమ్య మృతదేహం కాల్వలో గుర్తించబడింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. చిన్నారి ప్రాణం ఇలా ముగియడం అందరినీ కలచివేసింది.

మొదట్లో తల్లి చెప్పిన కథనాన్ని పోలీసులు నమ్మినా, ఆమె వాంగ్మూలంలో అనేక అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. చిన్నారి తానే దొగాడుతూ వెళ్లిందని చెప్పిన తల్లి మాటల్లో లోతుగా విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమ్య తల్లి చివరికి నేరాన్ని ఒప్పుకుంది. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారిని పోషించుకోవడం కష్టమైపోయిందని, ఆర్థిక భారంతో చిన్నారి రమ్యను తానే మురికికాల్వలోకి నెట్టేసినట్లు ఆమె అంగీకరించింది.


ఈ విషయాన్ని విన్న ప్రజలు తీవ్రంగా ఆవేదన చెందారు. పసిపాపకు తల్లి చేయి రక్షణగా ఉండాలి కానీ ఇక్కడ మాత్రం అదే చేయి ఆమె ప్రాణాన్ని తీశింది. ఈ సంఘటన సమాజంలో మానవత్వం ఎటు వెళ్తోందన్న ప్రశ్నను మళ్లీ లేవనెత్తింది. తమ బిడ్డలను కన్నతల్లే ఇలాగే చంపేస్తే, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Karnataka Library: ఆస్తులు అమ్మి పుస్తకాలు కొన్నాడు.. అసలు ట్విస్ట్ ఇదే!

ప్రజలు, బంధువులు, స్థానికులు ఈ దారుణ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నా పిల్లల ప్రాణాలను తల్లిదండ్రులు బలి చేయడం మానవత్వానికి విరుద్ధమని మండిపడుతున్నారు. చిన్నారుల ప్రాణాలు ఇలాగే తల్లిదండ్రుల నిర్లక్ష్యం, లేదా నిర్దయకు బలి కావడం సమాజానికి ఒక హెచ్చరికగా మారుతోంది.

ఈ సంఘటన పోలీసులు, అధికారులు, స్థానికులందరినీ కుదిపేసింది. పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపి చిన్నారి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరింత వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో రమ్య మరణం వెనుకున్న అసలు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరగాలని ప్రజలు కోరుతున్నారు.

చిన్నారి రమ్య జీవితం ఇలాగే ముగియడం ఎంతటి దారుణమో చెప్పలేం. పుట్టిన బిడ్డను చూసుకోవడం, ఆమెకు భవిష్యత్తు ఇవ్వడం తల్లిదండ్రుల కర్తవ్యం. కానీ ఈ కేసులో తల్లి తన సొంత బిడ్డకు శత్రువుగా మారడం హృదయ విదారక నిజం. తిరుపతి ప్రజలు ఈ సంఘటనను మరచిపోలేకపోతున్నారు. ఒక చిన్నారి జీవితం ఇలాగే ఆగిపోవడం సమాజానికి శాపంగా నిలిచింది.

Related News

Kurnool Bus Tragedy: అరుపులు.. ఏడుపులు ప్రమాదం ఎలా జరిగిందో.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ట్రావెల్ బస్సు గురించి కొత్త విషయాలు, ఇప్పుడెలా?

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడి మాటల్లో

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. అత్యంత విషాదకరమన్న సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగైదు రోజులు భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

Tiruvuru Row: తిరువూరు వ్యవహారంపై సీఎం సీరియస్.. చంద్రబాబే స్వయంగా రంగంలోకి.. వేటు తప్పదా?

Ys Jagan: గవర్నర్ వద్దకు జగన్.. ఎందుకంటే?

Bhumana Karunakar Reddy: టీటీడీలో ఉన్నవాళ్లంతా నా మనుషులే.. కాన్ఫిడెన్షియల్ సమాచారం నా చేతికి: భూమన సంచలన వ్యాఖ్యలు

Big Stories

×