Mohsin Naqvi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. పాకిస్తాన్ సర్కార్ ఆదేశాల మేరకు అక్కడి క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్లు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇండియాతో మ్యాచ్ ఆడాల్సిందేనని సూచనలు చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ నఖ్వీ ( pcb mohsin naqvi) సంబంధించిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. టీమిండియాకు చెందిన అభిషేక్ శర్మ ( abhishek sharma), హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ), ఇషాన్ కిషన్ లాంటి డేంజర్ ప్లేయర్లను తుది జట్టు నుంచి తప్పిస్తే, కచ్చితంగా వాళ్లతో మ్యాచ్ ఆడతామని నఖ్వీ ప్రకటన చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read: RCB-Jacqueline Fernandez: శృంగార తార కోసం రూ.8300 కోట్లు..? జైలులో ఉన్న సుకేష్ సంచలన ఆఫర్
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ నఖ్వీ ( pcb mohsin naqvi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పరువు తీసుకునేలా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఇండియాతో ఆడాలంటే కండిషన్ పెట్టారట మొహ్సీన్ నఖ్వీ. అభిషేక్ శర్మ హార్దిక్ పాండ్యా అలాగే ఇషాన్ కిషన్ లాంటి తోపు ప్లేయర్లను తుది జట్టు నుంచి తప్పిస్తే ఖచ్చితంగా ఇండియాతో మ్యాచ్ ఆడతామని మొహ్సీన్ నఖ్వీ వెల్లడించినట్లు ఓ పోస్టర్ వైరల్ గా మారింది. న్యూజిలాండ్ పైన ఈ క్రికెటర్లందరూ అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేశారని మొహ్సీన్ నఖ్వీ భయపడుతున్నారట. ఈ బలమైన క్రికెటర్లు పాకిస్తాన్ జట్టు పైన పడిపోతే.. తమ పరువు పోతుందని మొహ్సీన్ నఖ్వీ ( pcb mohsin naqvi) ఈ ఆలోచన చేస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఆయన పేరుతో మాత్రం పోస్టర్లు వైరల్ అవుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్ కు డెడ్ లైన్ విధించిందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ ఆడడంపై 48 గంటల్లో క్లారిటీ ఇవ్వాలని వెల్లడించిందట. ఆలోపు చెప్పకపోతే రెండు సంవత్సరాల పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన బ్యాన్ విధించే ప్రమాదం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మ్యాచ్ జరగని అందుకుగాను జరిగే నష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెల్లించేలా కోర్టుకు కూడా వెళ్ళనున్నారట.