E-Paper
Advertisement

10th Exams: టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయం.. ఆందోళనలో విద్యార్థులు

10th Exams: టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయం.. ఆందోళనలో విద్యార్థులు
Advertisement

10th Exams: వికారాబాద్‌లో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. ఆదిలాబాద్‌లో జవాబు పత్రాలు మాయం. ప్రస్తుతం ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఫస్ట్ ఎగ్జామ్ రోజే ఉట్నూర్‌లో ఆన్సర్ షీట్స్ మాయం కావడం కలకలం రేపుతోంది.

ఉట్నూర్‌లో మొత్తం 5 సెంటర్లలో విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. పరీక్ష అయిపోయాక జవాబు పత్రాలను అధికారులు పోస్ట్ ఆఫీస్‌లో అప్పజెప్పారు. పోస్ట్ సిబ్బంది జవాబు పత్రాలను 11 కట్టలుగా వేరు చేశారు. ఇన్విజిలేషన్ కార్యాలయానికి తరలించేందుకు ఆటోలో బస్టాండ్‌కు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఓ ఆన్సర్ షీట్స్ బండిల్ మిస్ అయింది.

Advertisement

వెంటనే పోస్టుమాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోస్టాఫీస్ నుంచి బస్ స్టేషన్ వరకు గాలించారు. అయినా కూడా ఎక్కడా పేపర్ బండిల్ కనిపించలేదు. దీంతో కేసు నమోదు చేశారు.

ఇక ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జవాబు పత్రాలు మాయమయ్యాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జవాబు పత్రాలు మాయం కావడంతో నష్టపోయిన విద్యార్థులకు ఎటువంటి పరిష్కార మార్గం చూపిస్తారని నిలదీస్తున్నారు.

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×