E-Paper
Advertisement

10th Exams: టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయం.. ఆందోళనలో విద్యార్థులు

10th Exams: టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయం.. ఆందోళనలో విద్యార్థులు

10th Exams: వికారాబాద్‌లో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. ఆదిలాబాద్‌లో జవాబు పత్రాలు మాయం. ప్రస్తుతం ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఫస్ట్ ఎగ్జామ్ రోజే ఉట్నూర్‌లో ఆన్సర్ షీట్స్ మాయం కావడం కలకలం రేపుతోంది.

ఉట్నూర్‌లో మొత్తం 5 సెంటర్లలో విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. పరీక్ష అయిపోయాక జవాబు పత్రాలను అధికారులు పోస్ట్ ఆఫీస్‌లో అప్పజెప్పారు. పోస్ట్ సిబ్బంది జవాబు పత్రాలను 11 కట్టలుగా వేరు చేశారు. ఇన్విజిలేషన్ కార్యాలయానికి తరలించేందుకు ఆటోలో బస్టాండ్‌కు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఓ ఆన్సర్ షీట్స్ బండిల్ మిస్ అయింది.

వెంటనే పోస్టుమాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోస్టాఫీస్ నుంచి బస్ స్టేషన్ వరకు గాలించారు. అయినా కూడా ఎక్కడా పేపర్ బండిల్ కనిపించలేదు. దీంతో కేసు నమోదు చేశారు.

ఇక ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జవాబు పత్రాలు మాయమయ్యాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జవాబు పత్రాలు మాయం కావడంతో నష్టపోయిన విద్యార్థులకు ఎటువంటి పరిష్కార మార్గం చూపిస్తారని నిలదీస్తున్నారు.

Tags

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×