BigTV English

10th Exams: టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయం.. ఆందోళనలో విద్యార్థులు

10th Exams: టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయం.. ఆందోళనలో విద్యార్థులు

10th Exams: వికారాబాద్‌లో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. ఆదిలాబాద్‌లో జవాబు పత్రాలు మాయం. ప్రస్తుతం ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఫస్ట్ ఎగ్జామ్ రోజే ఉట్నూర్‌లో ఆన్సర్ షీట్స్ మాయం కావడం కలకలం రేపుతోంది.


ఉట్నూర్‌లో మొత్తం 5 సెంటర్లలో విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. పరీక్ష అయిపోయాక జవాబు పత్రాలను అధికారులు పోస్ట్ ఆఫీస్‌లో అప్పజెప్పారు. పోస్ట్ సిబ్బంది జవాబు పత్రాలను 11 కట్టలుగా వేరు చేశారు. ఇన్విజిలేషన్ కార్యాలయానికి తరలించేందుకు ఆటోలో బస్టాండ్‌కు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఓ ఆన్సర్ షీట్స్ బండిల్ మిస్ అయింది.

వెంటనే పోస్టుమాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోస్టాఫీస్ నుంచి బస్ స్టేషన్ వరకు గాలించారు. అయినా కూడా ఎక్కడా పేపర్ బండిల్ కనిపించలేదు. దీంతో కేసు నమోదు చేశారు.


ఇక ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జవాబు పత్రాలు మాయమయ్యాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జవాబు పత్రాలు మాయం కావడంతో నష్టపోయిన విద్యార్థులకు ఎటువంటి పరిష్కార మార్గం చూపిస్తారని నిలదీస్తున్నారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×