BigTV English

Khammam : మిర్చి దొంగలు.. అర్ధరాత్రి కల్లంలో పంట చోరి..

Khammam : మిర్చి దొంగలు.. అర్ధరాత్రి కల్లంలో పంట చోరి..

Khammam : రైతు పంట వేసిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అకాలవర్షం వల్ల పంటలకు నష్టవాటిల్లుతుంది. పంటకు తెగుళ్లు సోకడం వల్ల అనుకున్నదాని కంటే తక్కువ దిగుబడి వస్తుంది. ఇలా రైతు ఏదో ఒక కారణంతో పంట నష్ట పోతాడు. ఖమ్మం జిల్లాలోనూ ఓ రైతుకు పంట చేతికి వచ్చింది కాని నోటికి అందలేదు.


వైరా మండలంలో శాంతినగర్ గ్రామానికి చెందిన కొల్లి నరసింహారావు అనే రైతు గ్రామంలో పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిర్చి ,మొక్కజొన్న పంటలు సాగు చేశారు. రెండు ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంటను కోసి పక్కనే ఉన్న వెంచర్ లో ఎండబోశారు.

ఎండిన మిర్చిని కుప్ప వేసి ఉంచారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిది క్వింటాళ్ల మిర్చిని వాహనంలో ఎత్తుకెళ్లారు. తెల్లవారు జామున మిర్చి కల్లం దగ్గరికి రైతు వెళ్లి చూశాడు. మిర్చి చోరీకి గురైందని గుర్తించి వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు రెండు లక్షల విలువైన మిర్చి చోరీకి గురైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.


Related News

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

Big Stories

×