E-Paper
Advertisement

Rajendra Nagar : ప్రాణం తీసిన పతంగి.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం

Rajendra Nagar : ప్రాణం తీసిన పతంగి.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం

Rajendra Nagar : సంక్రాంతి పండుగ సెలవుల్లో ఓ కుటుంబంలో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు తనిష్క్ మృతిచెందాడు.

సంక్రాంతి సెలవులు కావడంతో గాలి పటాలు ఎగుర వేయడానికి తన ముగ్గురు స్నేహితుల తో కలిసి మిద్దె మీదకు వెళ్లాడు. ఈ క్రమంలో గాలిపటం విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్‌తో బాలుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన తనిష్క్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యలు ధృవీకరించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాలిపటం ఎగురవేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పిల్లలకు సూచించారు. సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరించారు. తమ గారాల పట్టి.. ఇక కనిపించడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×