BigTV English

Rajendra Nagar : ప్రాణం తీసిన పతంగి.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం

Rajendra Nagar : ప్రాణం తీసిన పతంగి.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం

Rajendra Nagar : సంక్రాంతి పండుగ సెలవుల్లో ఓ కుటుంబంలో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు తనిష్క్ మృతిచెందాడు.


సంక్రాంతి సెలవులు కావడంతో గాలి పటాలు ఎగుర వేయడానికి తన ముగ్గురు స్నేహితుల తో కలిసి మిద్దె మీదకు వెళ్లాడు. ఈ క్రమంలో గాలిపటం విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్‌తో బాలుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన తనిష్క్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యలు ధృవీకరించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాలిపటం ఎగురవేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పిల్లలకు సూచించారు. సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరించారు. తమ గారాల పట్టి.. ఇక కనిపించడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×