E-Paper
Advertisement

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం
Advertisement

Mancherial district: దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. తీవ్రరూపం దాల్చకుండా ముందే పరిష్కరించుకుంటే బెటర్. ఏ మాత్రం జఠిలమైన అనేక అనర్థాలకు దారి తీస్తాయి. అలాంటి ఘటన ఒకటి మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. భార్యభర్తల మధ్య గొడవలో భార్య ముక్కు కొరికేశాడు ఆమె భర్త. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అసలు ఏం జరిగింది?

మంచిర్యాల జిల్లాలో దారుణం

పోలీసుల వివరాల ప్రకారం..మంచిర్యాల జిల్లా కోటపల్లి ప్రాంతానికి చెందిన మమత-మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సాగుతున్న వీళ్ల సంసారంలోకి చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. గడిచిన నాలుగేళ్లుగా అదనపు కట్నం తేవాలని భార్యని వేధిస్తున్నాడు భర్త మణిచందర్. ఈ క్రమంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మద్యానికి బానిసై కట్నం విషయంలో గొడవ చేసేవాడు భర్త. 10 రోజుల కిందట భార్యభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది.

భార్యభర్తల మధ్య గొడవ, భార్య ముక్కు కొరికిన భర్త

Advertisement

పట్టరాని కోపంతో మమత పిల్లలతో కలిసి తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. పరిస్థితి గమనించిన మణిచందర్‌, తన కుటుంబ సభ్యులతో కోటపల్లికి వచ్చాడు. ఇరు కుటుంబాలు.. మమత-మణిచందర్ మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మమత తండ్రి నారాయణపై దాడి చేయాడు మణిచందర్. కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన భార్య ముక్కు బలంగా కొరకడంతో తీవ్ర గాయమైంది. ముక్కు నుంచి రక్తం కారడంతో వెంటనే వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి మమత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై, విచారణ చేపట్టారు.

ALSO READ: ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినల్స్, ఎక్కడెక్కడంటే

Related News

ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినల్స్, ఎక్కడెక్కడంటే

కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు.. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి

చేయూత పింఛన్ అప్లై చేసుకోలేదా.. సాయంత్రం 5 గంటల వరకే లాస్ట్ ఛాన్స్!

మెదక్ జిల్లాలో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. 3 ఎకరాల రైతు ఖాతాలో 3,850 ఎకరాల భూమి?

ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!

Big Stories

Advertisement
×