E-Paper
Advertisement

Anand Mahindra: మెగాస్టార్ చిరంజీవిని కలవడం నిజంగా సర్ ప్రైజ్: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: మెగాస్టార్ చిరంజీవిని కలవడం నిజంగా సర్ ప్రైజ్: ఆనంద్ మహీంద్రా
Advertisement

Anand Mahindra: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2047 విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన.. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వివిధ రంగాల నేతలు, పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానితుడిగా వచ్చిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ పర్యటనలో తనకు ఎదురైన విశేష అనుభవాలను.. సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

మంగళవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన, రాష్ట్ర భవిష్యత్ దిశగా రూపొందించిన ‘తెలంగాణ విజన్ 2047’ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించే అవకాశం దక్కిందని అన్నారు. తెలంగాణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే ఈ సమ్మిట్ కొత్త ఆలోచనలకు, కొత్త పెట్టుబడులకు వేదికగా నిలుస్తుందంటూ ప్రశంసించారు. ఈ పర్యటనలోనే అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశం లభించిందని ఆయన వివరించారు.

Advertisement

ఈ భేటీపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. చిరంజీవి గారు ఒక లెజెండ్. ఆయనను కలవడం ఒక సర్ ప్రైజ్. కానీ ఆయనలోని వినయం, సహజ సిద్ధమైన జిజ్ఞాస ఆయన్ను మరింత ఆత్మీయుడిగా మార్చాయి. ఆయనను కలవడం ఒక శక్తివంతమైన విషయాన్ని గుర్తుచేసింది. సినిమా, వ్యాపారం, విధాన రూపకల్పన.. ఇలా ఏ రంగంలోనైనా శాశ్వత విజయం సాధించాలంటే నేర్చుకోవాలనే జిజ్ఞాస, వినయంతో వినగలిగే నైజం పునాదుల వంటివి అని తెలిపారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధిపై కూడా ప్రశంసలు కురిపించారు. యువ జనాభా, సాంకేతిక నైపుణ్యం, వ్యాపార వాతావరణం ఈ మూడు అంశాలు తెలంగాణను భవిష్యత్ పెట్టుబడుల కేంద్రంగా మార్చగల శక్తి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ఫొటో కూడా తమ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. చిరంజీవి, ఆనంద్ ముచ్చటిస్తుండగా.. మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి చిరునవ్వుతో వింటూ ఉండడం ఆ ఫొటోలో చూడొచ్చు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×