Jawaharnagar: స్వేచ్చ బ్యూరో: ప్లాట్లు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పరారైన ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వెంకటేష్ అనే వ్యక్తి తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు.
దీంతో ప్లాట్లు ఇవ్వకపోవడంతో పాటు గతంలో అతనికి ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు వెంకటేష్ ఇంటి వద్దకు వెళ్లి తీవ్ర ఆందోళన చేపట్టారు. అయితే అప్పటికే అతడు నివాసం ఉంటున్న ఇంటిని సైతం విక్రయించి, కుటుంబ సభ్యులతో కలిసి రాత్రికి రాత్రే వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో అక్కడి భాదితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Also read: JNTUH Inspections: మేడ్చల్లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్టీయూహెచ్ దాడులు!
రోజు కష్టపడి తమ కష్టార్జిత సొమ్ము కోల్పోయామని భాదితుల వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పోలీసులు వెంకటేష్పై క్రిమినల్ కేసు నమోదు చేసారు. అనంతరం అరెస్ట్ చేయడంతో పాటు తమ డబ్బులు తిరిగి ఇప్పించేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also read: AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్కో ఫైర్!