BigTV English
Advertisement

Rangareddy : శంషాబాద్ లో దొంగలముఠా బీభత్సం.. రూ.1.35 లక్షలతో పరార్

Rangareddy : శంషాబాద్ లో దొంగలముఠా బీభత్సం.. రూ.1.35 లక్షలతో పరార్

Rangareddy : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూర్ ఎక్స్ రోడ్ లో గుర్తు తెలియని దొంగల ముఠా దారి దోపిడికి తెగబడింది. అర్ధరాత్రి వస్తున్న వాహనాన్ని కాపుకాసి మరీ ఆపి.. కత్తులతో బెదిరించి గుర్తు తెలియని ముగ్గురు దొంగలు దోపిడికి పాల్పడ్డారు.


బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ లైలాండ్ వాహనంలో రమేష్, రాములు అనే ఇద్దరు వ్యక్తులు పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు దిగి పాలమాకుల వైపు వస్తున్నారు. అయితే మార్గం మధ్యలో గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్దకు రాగానే ఎదురుగా స్కూటీపై ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని ఆపారు. ఆ ముగ్గురు వ్యక్తులు హిందీ భాషలో మాట్లాడుతూ వారి వెంట తెచ్చుకున్న కత్తులను చూపించి రమేష్, రాములును బెదిరించి.. వారి దగ్గరున్న రూ. లక్షా 35 వేలు తీసుకున్నారు.

అక్కడ నుండి పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు వైపు పరారయ్యారు. దీంతో బాధితులు 100 మొబైల్ కు కాల్ చేయడంతో శంషాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×