E-Paper
Advertisement

Crime News: కూతుర్ని నరికి చంపిన తండ్రి.. పోలీసుల కళ్లల్లో కారం కొట్టి దాడి..

Crime News: కూతుర్ని నరికి చంపిన తండ్రి.. పోలీసుల కళ్లల్లో కారం కొట్టి దాడి..
peddapalli murder

Crime News(Telangana Latest Updates): కన్న కూతుర్ని గొడ్డలితో నరికి చంపాడో కసాయి తండ్రి. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిందీ దారుణ ఘటన. కూతుర్ని చంపిన తర్వాత కూడా ఓ స్థానికుడిపై దాడి చేశాడు. గతంలో తన భార్యను ఉరేసి చంపిన కేసులో అతను జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇప్పుడు కూతుర్ని కూడా బలి తీసుకున్నాడు.

నిందితుడు సదయ్యకు మానసిక స్థితి సరిగా లేదని కొందరు కాలనీవాసులు చెప్తున్నారు. నిందితుడు సదయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెహికల్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా స్థానికులు అడ్డుపడ్డారు. అతన్ని మాకు అప్పగించండి.. మేమే శిక్షిస్తాం అంటూ పట్టుబట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

నిందితుడిని బలవంతంగా తరలించబోతుండగా.. పోలీసుల వాహనంపై మూకుమ్మడిగా దాడి చేశారు గ్రామస్తులు. సదయ్యను కొట్టి చంపాలని వారంతా డిసైడ్ అయ్యారు. అందుకు పోలీసులు అడ్డుపడుతుండటంతో.. ఖాకీల కళ్లల్లో కారం చల్లారు కొందరు ఆందోళనకారులు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×