BigTV English
Advertisement

Doctor: డాక్టర్‌ను పొడిచి చంపిన టీచర్.. చికిత్స చేస్తుండగా దారుణం..

Doctor: డాక్టర్‌ను పొడిచి చంపిన టీచర్.. చికిత్స చేస్తుండగా దారుణం..
doctor murder

Doctor news kerala(Latest News Updates Telugu): ఇది మరీ దారుణం. పాపం ఆ డాక్టర్. ఆమెకు అసలేం సంబంధంలేని విషయం. వైద్యురాలిగా తన పని తాను చేసుకుపోతోంది. కాలికి గాయంతో వచ్చిన పేషెంట్‌కు చికిత్స చేస్తోంది. ఆ పేషెంట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. మద్యం మత్తులో చెలరేగిపోయాడు. చికిత్సకు ఉపయోగించే సర్జికల్ నైఫ్, సీజర్‌తో ఆ వైద్యురాలిని పొడిచి చంపాడు. నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో మరింత సంచలనంగా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే…


గవర్నమెంట్ టీచర్ సందీప్‌.. తన ఫ్యామిలీతో ఏదో గొడవపడ్డాడు. పోలీసులకు ఫోన్ చేసి తనను కాపాడాలని కోరాడు. పోలీసులు అతని ఇంటికి వచ్చేసరికి కాలికి గాయంతో కనిపించాడు. ట్రీట్‌మెంట్ కోసం అతన్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు బయటే ఉండగా.. రూమ్‌లో డాక్టర్ వందనా దాస్(23) అతని గాయానికి చికిత్స చేస్తోంది. అంతలోనే నిందితుడు సందీప్.. సడెన్‌గా రెచ్చిపోయాడు. డాక్టర్ వందనాను కత్తెర, కత్తితో పొడిచాడు. ఆమె భయంతో కేకలు వేస్తూ గది నుంచి బయటకు పరుగెత్తుకు వచ్చింది. గది బయట ఉన్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులనూ గాయపడిచాడు సందీప్. ఎలోగోలా అతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలతో డాక్టర్ వందనా దాస్ చనిపోవడం కలకలం రేపింది.

ఘటనా సమయంలో నిందితుడు సందీప్ మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు. డాక్టర్ హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. నిందితుడైన ప్రభుత్వ టీచర్ సందీప్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కేరళలోని కొల్లాం జిల్లా కొట్టరక్కరలో జరిగిందీ దారుణ ఉదంతం.


Related News

Bihar Elections: బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..

Delhi blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. ఇదిగో సీసీటీవీ ఫుటేజ్‌, కారులో ఉన్నది ఒక్కడే

Cold Weather: దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత.. చీకటైతే చాలు.. చుక్కలు చూపిస్తున్న చలి

Delhi Red Fort blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. చిక్కిన కారు ఓనర్, పుల్వామా వాసి

Delhi Bomb Blast: దిల్లీ బాంబు పేలుడులో భయానక దృశ్యాలు.. రెండు ముక్కలై కారుపై పడిన మృతదేహం

Delhi Blasts: ఏ కోణాన్నీ కొట్టిపారేయడం లేదు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా

Bomb Blasts: గత 5 ఏళ్లలో దేశంలో జరిగిన బాంబు పేలుళ్లు ఇవే, ఎంత మంది చనిపోయారంటే?

Delhi Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో పేలుడు.. దేశవ్యాప్తంగా హై అలర్ట్

Big Stories

×