BigTV English

Current Charges : డే అండ్ నైట్ వాయింపు.. కరెంట్ వాడకంలో తిరకాసు..

Current Charges : డే అండ్ నైట్ వాయింపు.. కరెంట్ వాడకంలో తిరకాసు..


Current Charges : విద్యుత్తు వినియోగాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేయాలని కేంద్ర విద్యుత్తుశాఖ స్పష్టం చేసింది. డిమాండ్‌ అధికంగా ఉన్న సమయంలో విద్యుత్తును వాడే వారిపై ఛార్జీల మోత మోగించాలని తేల్చి చెప్పింది. 10 కిలోవాట్లకు పైగా డిమాండ్‌ ఉన్న పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు పీక్‌ సమయంలో కరెంట్‌ వాడితే సాధారణ చార్జీల్లో 20 శాతానికి తగ్గకుండా చార్జీలు విధించాలని తెలిపింది. గృహ వినియోగదారులకు అయితే సాధారణ చార్జీల్లో 10 శాతానికి తగ్గకుండా చార్జీలు వసూలు చేయాలని విద్యుత్ శాఖ సూచించింది. సౌరవిద్యుత్తు ఉత్పత్తి జరిగే సమయంలో ఉంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో విద్యుత్తు వినియోగించే వారికి సాధారణ చార్జీలపై 20శాతానికి పైగా రాయితీతో కరెంట్‌ ఇవ్వాలని తెలిపింది.

ఇప్పటిదాకా పారిశ్రామిక వినియోగదారులకే వినియోగాన్ని బట్టి చార్జీల విధానం అమల్లో ఉంది. దీన్ని 2025 ఏప్రిల్‌ 1 నుంచి గృహ వినియోగదారులందరికీ వర్తింపజేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం ఆయా వినియోగదారులకు ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించాలని గుర్తు చేసింది. ఈ మేరకు ఈ నెల 14న ఎలక్ట్రిసిటీ సవరణ చట్టం-2023తో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇక వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు వినియోగాన్ని బట్టి ఛార్జీల అమలు విధానాన్ని 2024 ఏప్రిల్‌ 1నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం నిర్దేశించింది. వ్యవసాయ వినియోగదారులు మినహా గృహ వినియోగదారులందరికీ 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది. ఇక సౌర విద్యుత్తు ఉత్పత్తి జరిగే సమయాన్ని ఖరారు చేసే అధికారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి కేంద్రం ఇచ్చింది. ఇక స్మార్ట్‌ మీటర్లలోనే ఏ సమయంలో విద్యుత్తును వినియోగించాలి? ఏ సమయంలో తగ్గించుకోవాలనే దానిపై సెట్టింగ్స్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.


Related News

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

Big Stories

×