DCM Accident in Nizamabad(Today news in telangana): నిజామాబాద్ జిల్లా రూరల్ లోని మల్లారం అటవీప్రాంతానికి సమీపంలో గల కొత్తపేట శివారులో గత అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. వర్ని మండలం బడాపహాడ్ కు చెందిన 30 మందిలో.. ఇద్దరు మరణించారు. ఒక వ్యక్తి ప్రమాద స్థలంలోనే మరణించగా.. మరొక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన 15 మంది జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా ఇద్దరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ వెల్లడించారు. కాగా.. క్షతగాత్రులలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. వీరంతా కమ్మర్ పల్లి మండలానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.