BigTV English
Advertisement

TG Govt: దసరాకు మరో తీపికబురు చెప్పిన మంత్రులు భట్టి, పొంగులేటి.. అక్కడంతా ఆనందమే ఆనందం..

TG Govt: దసరాకు మరో తీపికబురు చెప్పిన మంత్రులు భట్టి, పొంగులేటి.. అక్కడంతా ఆనందమే ఆనందం..

TG Govt: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వరాలజల్లు కురిపిస్తోంది. ఇప్పటికే దసరా బోనస్ కింద సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. వీరికి సింగరేణి కార్మికులు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే సభలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు కార్మికులకు మరొక గుడ్ న్యూస్ చెప్పారు.


ఈ సభలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిలు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల్లో చాలా మంది పేదలు ఉన్నారన్నారు. తమది పేదల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి.. పేదల సంక్షేమానికి అన్ని పథకాలు వర్తించేలా తాము పాలన సాగిస్తున్నామన్నారు. అలాగే సింగరేణిలో కార్పొరేట్ స్కూల్స్ ఏర్పాటు చేసేలా.. ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

మీ బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా.. విద్యాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సింగరేణిలో వైద్యానికి సైతం ఎటువంటి కొరత లేకుండా.. కార్మికుల కోసమే కాకుండా.. స్థానికుల కోసం కూడా కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.


ఇక ఈ సమావేశంలో కార్మికులకు ఇప్పటికే బోనస్ ప్రకటించిన ప్రభుత్వం తరపున.. మరో గుడ్ న్యూస్ కూడా మంత్రులు ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుందని, ఆ కలను సాకారం చేసుకొనడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉంటుందన్నారు. అయితే సింగరేణి కార్మికుల సొంతింటి కలపై త్వరలోనే తాము తీపికబురు అందిస్తామని మంత్రులు ప్రకటించారు.

Also Read: TG Politics: బాబును కలిసిన తీగల, మల్లారెడ్డి.. టీడీపీలోకి అంటూ పొలిటికల్ బాంబ్.. కానీ..

దీనితో సభకు హాజరైన కార్మికులు ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం సింగరేణి కార్మికుల పట్ల ప్రతి విషయంలో సానుకూలంగా ఉంటుందని, కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో ప్రభుత్వం చర్చిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

ఏదిఏమైనా దసరాకు బోనస్ అంటూ ప్రకటించిన ప్రభుత్వం.. తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడాన్ని కార్మికులు ఆహ్వానిస్తున్నారు. అలాగే బోనస్ ప్రకటనతో తమకు దసరా పండుగ ముందే వచ్చిందా.. అనే రీతిలో తమ ఇంట సంబరాలు జరుపుకున్నట్లు కార్మికులు తెలుపుతున్నారు. అయితే ఇక కార్మికులకు చెప్పిన విధంగా సొంతింటి ప్రభుత్వం నుండి వచ్చే తీపికబురు కోసం వెయిటింగ్ అంటున్నారు కార్మికులు.

Related News

Telangana: కార్తీక పౌర్ణమి నాడు జంతుబలితో క్షుద్రపూజలు.. స్కూల్‌, శ్మశానవాటికలో..

Chevella Bus Accident: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి

Telangana Politics: జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాస్ స్పీచ్..

Collages Bandh: రూ. 5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీలు బంద్..!

CP Sajjanar: డ్యూటీలో తప్పులు చేస్తే చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్-బీజేపీలకు నవంబర్ సెంటిమెంట్ మాటేంటి?

High Court: మాయం అవుతున్న చెరువులు.. రెవెన్యూ శాఖ అధికారుల పై హైకోర్టు సీరియస్

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Big Stories

×