E-Paper
Advertisement

TG Govt: దసరాకు మరో తీపికబురు చెప్పిన మంత్రులు భట్టి, పొంగులేటి.. అక్కడంతా ఆనందమే ఆనందం..

TG Govt: దసరాకు మరో తీపికబురు చెప్పిన మంత్రులు భట్టి, పొంగులేటి.. అక్కడంతా ఆనందమే ఆనందం..
Advertisement

TG Govt: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వరాలజల్లు కురిపిస్తోంది. ఇప్పటికే దసరా బోనస్ కింద సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. వీరికి సింగరేణి కార్మికులు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే సభలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు కార్మికులకు మరొక గుడ్ న్యూస్ చెప్పారు.

ఈ సభలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిలు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల్లో చాలా మంది పేదలు ఉన్నారన్నారు. తమది పేదల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి.. పేదల సంక్షేమానికి అన్ని పథకాలు వర్తించేలా తాము పాలన సాగిస్తున్నామన్నారు. అలాగే సింగరేణిలో కార్పొరేట్ స్కూల్స్ ఏర్పాటు చేసేలా.. ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Advertisement

మీ బిడ్డలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా.. విద్యాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సింగరేణిలో వైద్యానికి సైతం ఎటువంటి కొరత లేకుండా.. కార్మికుల కోసమే కాకుండా.. స్థానికుల కోసం కూడా కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Advertisement

ఇక ఈ సమావేశంలో కార్మికులకు ఇప్పటికే బోనస్ ప్రకటించిన ప్రభుత్వం తరపున.. మరో గుడ్ న్యూస్ కూడా మంత్రులు ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుందని, ఆ కలను సాకారం చేసుకొనడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉంటుందన్నారు. అయితే సింగరేణి కార్మికుల సొంతింటి కలపై త్వరలోనే తాము తీపికబురు అందిస్తామని మంత్రులు ప్రకటించారు.

Also Read: TG Politics: బాబును కలిసిన తీగల, మల్లారెడ్డి.. టీడీపీలోకి అంటూ పొలిటికల్ బాంబ్.. కానీ..

దీనితో సభకు హాజరైన కార్మికులు ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం సింగరేణి కార్మికుల పట్ల ప్రతి విషయంలో సానుకూలంగా ఉంటుందని, కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో ప్రభుత్వం చర్చిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

ఏదిఏమైనా దసరాకు బోనస్ అంటూ ప్రకటించిన ప్రభుత్వం.. తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడాన్ని కార్మికులు ఆహ్వానిస్తున్నారు. అలాగే బోనస్ ప్రకటనతో తమకు దసరా పండుగ ముందే వచ్చిందా.. అనే రీతిలో తమ ఇంట సంబరాలు జరుపుకున్నట్లు కార్మికులు తెలుపుతున్నారు. అయితే ఇక కార్మికులకు చెప్పిన విధంగా సొంతింటి ప్రభుత్వం నుండి వచ్చే తీపికబురు కోసం వెయిటింగ్ అంటున్నారు కార్మికులు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×