E-Paper
Advertisement

Harish Rao & KTR Delhi Tour: ఢిల్లీకి బీఆర్ఎస్ అగ్రనేతలు.. కవిత బెయిల్ కోసం?

Harish Rao & KTR Delhi Tour: ఢిల్లీకి బీఆర్ఎస్ అగ్రనేతలు.. కవిత బెయిల్ కోసం?

Harish Rao and KTR Delhi Tour(Political news in telangana): బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో మకాం వేశారు. మధ్యం విధానంలో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వారు ఢిల్లీకి వెళ్లడం పట్ల కొందరు రాజకీయ నాయకుల వాదన మరోలా ఉంది. వీళ్లిద్దరు కవితకు బెయిల్ తో పాటు బీజేపీ అగ్రనాయకులతో కలుస్తున్నారని. బీజేపీతో ములాఖత్ అయ్యి కవితను విడిపిస్తారని కొందరు చెబుతున్నారు. మరి కొందరు బీజేపీ తో కలిసి ఎన్నికలకు వెళ్దామని సంకేతాలు పంపుతున్నారని చెబుతున్నారు.

మొన్నీమధ్యే హరీశ్ రావు కవితను కలిశారు. వారంలోనే మరోసారి కవితతో సమావేశం అయ్యారు హరీశ్ రావు. ఇక కేటీఆర్ తో కలిసి హరీశ్ రావు ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్ లో గ్రేటర్ మీటింగ్ ను తలసానికి అప్పగించి హస్తినకు చేరుకున్నారు దీనిపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఇద్ధరు బీజేపీ నేత‌ల‌తో ట‌చ్ లోకి వెళ్లార‌ని, బీజేపీ అగ్రనాయకులతో సమావేశం కోసం కేసీఆర్ వీళ్లిద్దరిని పంపార‌ని కొన్ని వర్గాల్లో టాక్ ఉంది. గులాబీ నాయకుల ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్-బీజేపీ ములాఖ‌త్ అంటూ కాంగ్రెస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. క‌విత‌ను బ‌య‌ట‌కు తీసుక‌రావ‌టం, కాంగ్రెస్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు బీజేపీతో క‌లిసి ప‌నిచేసే ఒప్పందాలు జ‌రుగుతున్నాయ‌ని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..చర్చపై ఉత్కంఠ!

సోమ‌వారం బెయిల్ పిటీషన్ వేసినా నాలుగైదు రోజులు అక్కడే ఏం చేస్తారని.. ఢిల్లీ లిక్కర్ కేసును ఎవ‌రి త‌ర‌ఫున వాదించినా ముగ్గురు న‌లుగురు లాయ‌ర్లే వాదిస్తున్నారు. ఇక వారితో చ‌ర్చించేది ఏముంది. అంటూ కాంగ్రెస్ లోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ మద్యం అవకతవకల కేసులో కవితకు మరోసారి చుక్కుదురైంది. ఆమెకు విధించిన జ్యుడిషియల్ కస్టడీ కేసులోను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ వరకు పొడిగించింది. దీనిపై బీఆర్ఎస్ వివ‌ర‌ణ ఇచ్చింది. క‌విత బెయిల్ పిటీష‌న్ కోసం ఢిల్లీలో ఉన్నార‌ని, సుప్రీంకోర్టు వేస‌వి సెల‌వులు ముగిసిన త‌ర్వాత బెయిల్ పిటీష‌న్ వేస్తున్నామ‌ని, సోమ‌వారం వేసే అవ‌కాశం ఉన్నందున న్యాయ నిపుణుల‌తో మాట్లాడేందుకు సోమ‌వారం వ‌ర‌కు ఢిల్లీలోనే ఉంటార‌ని చెప్పింది.

Tags

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×