E-Paper
Advertisement

Munugode By Poll : ఓటుకు బంగారు నాణెం!.. మునుగోడులో భారీ తాయిలం?

Munugode By Poll : ఓటుకు బంగారు నాణెం!.. మునుగోడులో భారీ తాయిలం?

Munugode By Poll : మునుగోడు బై పోల్ కు సమయం దగ్గర పడుతోంది. అన్నిపార్టీలు ప్రచారాన్ని హోరెత్తించగా.. ఇప్పడిక పంపకాలపై దృష్టి పెట్టాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం.. నేరుగా కొందరి ఖాతాల్లోకి సుశి ఇన్ఫ్రా నుంచి డబ్బుల వచ్చిపడటం.. డైలీ మందు, మాంసం ఇంటికి రావడం.. ఇలా ధూంధాంగా ముగిసింది మునుగోడు ఎన్నికల ప్రచారం.

మౌకులు మూగబోయాక.. ఇక అసలు పని ప్రారంభించేందుకు పార్టీ వర్గాలు రెడీ అయ్యాయి. బయటివాళ్లంతా నియోజకవర్గం వదిలి వెళ్లిపోగా.. చీకట్లో అసలు సంగతి మొదలైంది. అదే ఓటుకు నోటు. ఓటర్లకు డబ్బు పంపిణీ. ఒక్కో ఓటుకు 10 వేల వరకూ ఇస్తున్నారంటూ టాక్. ఏ పార్టీ ఇస్తోంది అంటే.. ప్రధాన పార్టీలన్నీ తమ శక్తి మేర డబ్బు పంచుతున్నాయని తెలుస్తోంది. ఒట్టి డబ్బేనా అంటే.. కాదు కాదు బంగారం కూడా ఇస్తున్నారట. అవును, మునుగోడు ఓటర్లకు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గోల్డ్ కాయిన్స్ పంచుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం బంగారం ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మాకే వేయండి అని పిలుపునివ్వడం బీజేపీని ఉద్దేశించే అంటున్నారు.

మోదీ, బీజేపీ ఫోటోతో.. ఒక గ్రాము బంగారు నాణెంను కవర్ లో పెట్టి బీజేపీ అభ్యర్థి ఓటర్లుకు ఇస్తున్నారని చెబుతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. కొందరికి ఒక గ్రాము బంగారం ఇస్తుంటే.. కుటుంబానికి తులం బంగారం పంచుతున్నారని మరికొందరు అంటున్నారు. ఇదే నిజమైతే మునుగోడు ఉప ఎన్నిక ఎంత ఖరీదుగా మారిందో?

బీజేపీ, టీఆర్ఎస్ లు ఇప్పటికే వందల కోట్ల ఖర్చు చేశాయనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే ఓటర్లకు మందు, విందులతో పాటు గడియారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి గిఫ్ట్ గా కూడా ఇచ్చారట. మరో అడుగు ముందుకేసి.. ఏకంగా కుటుంబానికి తులం బంగారం పంచుతున్నారనే ప్రచారం మరింత కలకలం రేపుతున్నాయి. ఈ రేసులో కాంగ్రెస్ పార్టీ చాలా వెనకాలే ఉందంటున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికే అనుకుంటే.. మునుగోడు బై పోల్ అంతకంటే ఖరీదైన వ్యవహారంగా మారడం సంచలనంగా మారింది. మూడు ప్రధాన పార్టీలకు గెలుపు అత్యంత ప్రాధాన్యం కావడంతో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు డబ్బులు ఖర్చు చేస్తుండటంతో ఓటర్లు ఎటువైపు షిఫ్ట్ అవుతారనే ఉత్కంఠ.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×