BigTV English

Nizamabad : ఆర్మూర్ లో భారీ చోరీ.. కిలోన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు..

Nizamabad : ఆర్మూర్ లో భారీ చోరీ.. కిలోన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు..

Nizamabad : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మహాలక్ష్మి కాలనీలో శుక్రవారం సాయంత్రం కిలోన్నర బంగారం చోరీ జరిగింది. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కో ఆపరేటివ్ బ్యాంకు నుండి ఆర్మూర్ పట్టణానికి చెందిన డాక్టర్ ఈశ్వర్ చంద్ర ఓ కారులో బంగారాన్ని మహాలక్ష్మి కాలనీలో గల మందిరం వద్దకు తీసుకొచ్చారు.


బంగారు ఆభరణాలను కారులో ఉంచి ఆలయంలో పూజలు చేసి వచ్చేలోగా బంగారం కనిపించలేదు. అనంతరం బాధితుడు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.బంగారం విలువ సుమారు కోటిన్నర ఉంటుందని బాధితుడు తెలిపారు. కాగా డాక్టర్ ఈశ్వర్ చంద్ర గతంలో వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు.

ప్రస్తుతం ఆర్మూర్ లోని పాత పోలీస్ స్టేషన్ వద్ద మెడికల్ క్లినిక్ ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అవసరం నిమిత్తం బ్యాంకు లాకర్ లో ఉన్న కిలోన్నర బంగారాన్ని తీసి బ్యాగులో పెట్టుకుని కారులో ఉంచారు. మహాలక్ష్మి మందిరంలో పూజలు చేసేందుకు వెళ్లడంతో అది గమనించిన దుండగులు దానిని కాజేశారు.


విషయం తెలియగానే జిల్లా సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు అదనపు సీపీ జయరాం చోరీ జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓ తో పాటు జిల్లాలోని టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందంతో.. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కారులో గల వేలిముద్రలను సేకరించారు.

Tags

Related News

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Big Stories

×