BigTV English

Covid : తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు..

Covid : తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు..

Covid : దేశంలో కరోనా మళ్లీ కలవరం పెడుతోంది. కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.


కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేస్తోంది. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలోని గుండె చికిత్స విభాగంలో కరోనా వార్డు ఏర్పాటు చేశారు. 50 పడకలతో పూర్తిస్థాయి కరోనా వార్డును అందుబాటులో ఉంచారు. వార్డులో ఆక్సిజన్, వెంటిలేటర్ ను ఆసుపత్రి సిబ్బంది ఏర్పాటు చేశారు.

ఇలా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరోవైపు అనుమానిత రోగులకు కోవిడ్ టెస్టులు చేసేందుకు ల్యాబ్ లను సిద్ధం చేశారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×