BigTV English

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..

Hyderabad : హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. కాకినాడకు చెందిన భీమ్‌శంకర్‌ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ బైక్‌షోరూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. షోరూం ప్రాంగణంలోనే ఓ గదిలో అతడి కుటుంబం నివాసముంటోంది. అతడి కుమారుడు వివేకానంద ఎప్పటిలాగే స్నేహితులతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునేందుకు వెళ్లాడు.


రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి గుంతలో నీరు చేరింది. ఆ గుంతలో పడిన కర్రను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆరేళ్ల వివేకానంద పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకునేలోపే బాలుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఎస్ఐ దాలి నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇటీవల సికింద్రాబాద్ లో మౌనిక అనే బాలిక మ్యాన్ హోల్ పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మరో బాలుడు నీటి గుంతకు బలైపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×