E-Paper
Advertisement

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..
Advertisement

Hyderabad : హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. కాకినాడకు చెందిన భీమ్‌శంకర్‌ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ బైక్‌షోరూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. షోరూం ప్రాంగణంలోనే ఓ గదిలో అతడి కుటుంబం నివాసముంటోంది. అతడి కుమారుడు వివేకానంద ఎప్పటిలాగే స్నేహితులతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునేందుకు వెళ్లాడు.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి గుంతలో నీరు చేరింది. ఆ గుంతలో పడిన కర్రను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆరేళ్ల వివేకానంద పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకునేలోపే బాలుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఎస్ఐ దాలి నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇటీవల సికింద్రాబాద్ లో మౌనిక అనే బాలిక మ్యాన్ హోల్ పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మరో బాలుడు నీటి గుంతకు బలైపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×