E-Paper
Advertisement

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..

Hyderabad : హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. కాకినాడకు చెందిన భీమ్‌శంకర్‌ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ బైక్‌షోరూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. షోరూం ప్రాంగణంలోనే ఓ గదిలో అతడి కుటుంబం నివాసముంటోంది. అతడి కుమారుడు వివేకానంద ఎప్పటిలాగే స్నేహితులతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునేందుకు వెళ్లాడు.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి గుంతలో నీరు చేరింది. ఆ గుంతలో పడిన కర్రను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆరేళ్ల వివేకానంద పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకునేలోపే బాలుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఎస్ఐ దాలి నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇటీవల సికింద్రాబాద్ లో మౌనిక అనే బాలిక మ్యాన్ హోల్ పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మరో బాలుడు నీటి గుంతకు బలైపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×