Hyderabad Metro: సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో మెట్రో పిల్లర్ల చుట్టూ గుంతలు తవ్విన వ్యవహారంపై ప్రభుత్వ యంత్రాగం స్పందించింది. ఈ అంశంపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్.. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు నోటీసులు పంపింది. అయితే ఈ తవ్వకాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని.. ఇది పూర్తిగా హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాలని స్పష్టం చేసింది. పనులకు తమ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ బిగ్ టీవీకి లైవ్ లో తెలిపారు.
Also Read: Jio, Vi యూజర్లకు గుడ్ న్యూస్.. మీకు నచ్చిన VIP మొబైల్ నంబర్ను ఇంటి నుంచే బుక్ చేసుకోండి!
బిగ్ టీవీ రిపోర్టర్ సుజాత స్వయంగా మల్కాజిగిరి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కు లైవ్ లో కాల్ చేశారు. ఈ సందర్భంగా సదరు అధికారి మాట్లాడుతూ ఆ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని పునరుద్ఘటించారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని మెట్రోకు నోటీసులు సైతం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తవ్వకాలకు పూర్తి బాధ్యత మెట్రోదేనని స్పష్టం చేశారు. అయితే ఇది నేరుగా మెట్రో ఆధ్వర్యంలో జరిగిందా? లేదా కాంట్రక్టర్ చేశారా? అన్నది తెలియాల్సి ఉందన్నారు. దీనిపై క్లారిటీ వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు.
Also Read: దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్లోనూ షాక్!