BigTV English

Student Missing : 8 రోజుల క్రితం అదృశ్యం.. విశాఖ బీచ్ లో మృతదేహం.. ఏం జరిగింది..?

Student Missing : 8 రోజుల క్రితం అదృశ్యం.. విశాఖ బీచ్ లో మృతదేహం.. ఏం జరిగింది..?
IIT hyderabad student missing news

IIT hyderabad student missing news(Telangana news updates): తల్లిదండ్రులు తమ కుమారుడిని ఉన్నత చదువు చదివించాలని సంకల్పించారు. వారి ఆశయాలకు తగ్గట్టే ఆ కుమారుడు చదువులో ముందున్నాడు. ఐఐటీ హైదరాబాద్‌ లో సీటు సాధించాడు. మెకానికల్ విభాగంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో 8 రోజుల క్రితం ఈ విద్యార్థి అదృశ్యమయ్యాడు.


నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్‌ ఈ నెల 17న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆ విద్యార్థి విశాఖలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అతడి కోసం వివిధ ప్రాంతాల్లో పోలీసులు, తల్లిదండ్రులు గాలించారు. ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్ మూర్తి, ఇద్దరు ప్రత్యేక అధికారులను విశాఖకు పంపించారు.

చివరకు విద్యార్థి కార్తీక్‌ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. అతడు విశాఖ తీరంలో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు. ఆ విద్యార్థి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. దీంతో కార్తీక్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×