E-Paper
Advertisement

Parliament : రాతంత్రా ప్రతిపక్షాల మౌన దీక్ష .. మణిపూర్ పై చర్చకు పట్టు..

Parliament : రాతంత్రా ప్రతిపక్షాల మౌన దీక్ష .. మణిపూర్ పై చర్చకు పట్టు..
Parliament monsoon session live updates

Parliament monsoon session live updates(Latest breaking news in telugu): మణిపూర్‌ అల్లర్ల అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఈ ఘటనలపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడం మరో వివాదానికి దారి తీసింది. ఆప్‌ ఎంపీ అనుచితంగా ప్రవర్తించారంటూ వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రత్యేక తీర్మానం చేసి ఆయనను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేశారు.

కాంగ్రెస్‌, ఆప్ సహా ఇండియా సభ్యులు సోమవారం రాత్రి 11 గంటలకు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్షకు దిగారు. సస్పెండైన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ దీక్షలో పాల్గొన్నారు. విపక్ష కూటమి ఎంపీలు రాత్రంతా నిరసన కొనసాగించారు.

సోమవారం ప్రతిపక్షాలు ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. ఆ సమయంలో మణిపూర్‌ అంశంపై చర్చకు తాము సిద్ధమేనని లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కానీ ప్రతిపక్షాలే ఇందుకు అంగీకరించడం లేదని మండిపడ్డారు. మరోవైపు మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలు చర్చంచారు.

బీజేపీ సమావేశానికి ధీటుగా ఇండియా నాయకులు భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై పార్లమెంట్ ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మణిపూర్ అంశమే ప్రధాన అజెండాగా మంతనాలు జరిపారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×