BigTV English

Parliament : రాతంత్రా ప్రతిపక్షాల మౌన దీక్ష .. మణిపూర్ పై చర్చకు పట్టు..

Parliament : రాతంత్రా ప్రతిపక్షాల మౌన దీక్ష .. మణిపూర్ పై చర్చకు పట్టు..
Parliament monsoon session live updates

Parliament monsoon session live updates(Latest breaking news in telugu): మణిపూర్‌ అల్లర్ల అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఈ ఘటనలపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడం మరో వివాదానికి దారి తీసింది. ఆప్‌ ఎంపీ అనుచితంగా ప్రవర్తించారంటూ వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రత్యేక తీర్మానం చేసి ఆయనను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేశారు.


కాంగ్రెస్‌, ఆప్ సహా ఇండియా సభ్యులు సోమవారం రాత్రి 11 గంటలకు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్షకు దిగారు. సస్పెండైన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ దీక్షలో పాల్గొన్నారు. విపక్ష కూటమి ఎంపీలు రాత్రంతా నిరసన కొనసాగించారు.

సోమవారం ప్రతిపక్షాలు ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. ఆ సమయంలో మణిపూర్‌ అంశంపై చర్చకు తాము సిద్ధమేనని లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కానీ ప్రతిపక్షాలే ఇందుకు అంగీకరించడం లేదని మండిపడ్డారు. మరోవైపు మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలు చర్చంచారు.


బీజేపీ సమావేశానికి ధీటుగా ఇండియా నాయకులు భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై పార్లమెంట్ ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మణిపూర్ అంశమే ప్రధాన అజెండాగా మంతనాలు జరిపారు.

Related News

Jan Dhan Account Re-KYC: జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి

Whiskey Sales: దేశంలో విస్కీ అమ్మకాల లెక్కలు.. టాప్‌లో సౌత్ రాష్ట్రాలు, ఏపీ-తెలంగాణల్లో ఎంతెంత?

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Bihar News: బీహార్ ప్రీ-పోల్ సర్వే.. మహా కూటమికి అనుకూలం, ఎన్డీయే కష్టాలు? చివరలో ఏమైనా జరగొచ్చు

Pakistan Prime Minister: భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. మోడీ స్కెచ్ ఏంటి?

Chennai News: పార్టీ తరపున మృతులకు 20 లక్షలు.. టీవీకే నేతలపై కేసులు, విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత

Karur stampede updates: విజయ్ అరెస్టు తప్పదా? పెరుగుతోన్న మృతులు, విచారణకు ఏకసభ్య కమిషన్

Big Stories

×