E-Paper
Advertisement

Parliament : రాతంత్రా ప్రతిపక్షాల మౌన దీక్ష .. మణిపూర్ పై చర్చకు పట్టు..

Parliament : రాతంత్రా ప్రతిపక్షాల మౌన దీక్ష .. మణిపూర్ పై చర్చకు పట్టు..
Advertisement
Parliament monsoon session live updates

Parliament monsoon session live updates(Latest breaking news in telugu): మణిపూర్‌ అల్లర్ల అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఈ ఘటనలపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడం మరో వివాదానికి దారి తీసింది. ఆప్‌ ఎంపీ అనుచితంగా ప్రవర్తించారంటూ వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రత్యేక తీర్మానం చేసి ఆయనను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేశారు.

కాంగ్రెస్‌, ఆప్ సహా ఇండియా సభ్యులు సోమవారం రాత్రి 11 గంటలకు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్షకు దిగారు. సస్పెండైన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ దీక్షలో పాల్గొన్నారు. విపక్ష కూటమి ఎంపీలు రాత్రంతా నిరసన కొనసాగించారు.

Advertisement

సోమవారం ప్రతిపక్షాలు ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. ఆ సమయంలో మణిపూర్‌ అంశంపై చర్చకు తాము సిద్ధమేనని లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కానీ ప్రతిపక్షాలే ఇందుకు అంగీకరించడం లేదని మండిపడ్డారు. మరోవైపు మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలు చర్చంచారు.

బీజేపీ సమావేశానికి ధీటుగా ఇండియా నాయకులు భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై పార్లమెంట్ ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మణిపూర్ అంశమే ప్రధాన అజెండాగా మంతనాలు జరిపారు.

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×