Big Stories

Kishan Reddy : కిషన్‌రెడ్డికి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స..

- Advertisement -

.Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆస్పత్రిలో చేరారు. గ్యాస్‌ సమస్య కారణంగా ఆదివారం రాత్రి 10.50 గంటల సమయంలో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కార్డియో న్యూరో సెంటర్‌లోని కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. కిషన్ రెడ్డిని పరిశీలనలో ఉంచామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

- Advertisement -

ఆదివారం రాత్రి 8.30 గంటల వరకు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ కు ఆయన వ్యక్తిగత సిబ్బంది తరలించారు. ఎలాంటి ప్రమాదం లేదని ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News