E-Paper
Advertisement

KTR: మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నా: కేటీఆర్

KTR: మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నా: కేటీఆర్
Advertisement

KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడొద్దంటూ ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు తాము చాలా కష్టపడ్డామన్నారు. రూ. 9500 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు. రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదన్నారు. కార్నింగ్ ప్లాంట్, అమరరాజా కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తదని తాను ఆశిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం సీఎం మానేయాలంటూ ఆయన అన్నారు.

Also Read: సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభం

Advertisement

ఇదిలా ఉంటే.. యూట్యూబ్ మాజీ సీఈఓ సుశాన్ ఒజ్కికి మృతివార్త చాలా బాధ కలిగించిందన్నారు. అత్యంత డైనమిక్ గా ఉండే ఒజ్కికి ఎంతో తెలివైనవారన్నారు. ఆమెతో పలు సందర్భాల్లో మాట్లాడడం ద్వారా పలు విషయాలు నేర్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఒజ్కికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×