E-Paper
Advertisement

Sitarama Project Trial Run: సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభం

Sitarama Project Trial Run: సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభం

Sita Rama Lift Irrigation Project: భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ -2ను ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పంప్ హౌస్ ట్రయల్ రన్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పంద్రాగస్టు 15న రూ. 2 లక్షల రుణమాఫీని ప్రకటిస్తామని తెలిపారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరిస్తామని ఆయన చెప్పారు.

Also Read: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా మాట్లాడొద్దు..రేవంత్ కు కేటీఆర్ స్వీట్ వార్నింగ్

రీడిజైన్ పేరుతో గత పాలకులు రూ. 8 వేల కోట్లు వృథా చేశారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు నత్తనడక సాగాయన్నారు. పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల పూర్తి చేయాలని వారు చెప్పారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు వస్తాయంటూ మంత్రి వివరించారు.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×