KTR Demand: కేంద్రమంత్రి బండి సంజయ్ను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక మైనర్ బాలికకు తీవ్ర అన్యాయం జరిగితే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఈ కేసులో బాధిత బాలికకు న్యాయం జరగాలంటూ మొదటి నుండి గళమెత్తి, అండగా నిలబడి పోరాడింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేతులు కలిపి బాధిత బాలికకు అన్యాయం చేయాలని చూశాయని ఆయన ఆరోపించారు. ఒకవైపు కేంద్రమంత్రి, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ఈ పోక్సో (POCSO) కేసును పూర్తిగా నీరుగార్చేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. సమాజంలో తలదించుకునేలా చేసిన నిందితుడిని ఇన్నాళ్లపాటు వెనకేసుకొచ్చి, దాచిపెట్టింది స్వయంగా కేంద్రమంత్రే కాదా? అని కేటీఆర్ నిలదీశారు.
ఈ కేసులో అధికార, ప్రతిపక్షాలు ఎంత నొక్కేయాలని చూసినా బీఆర్ఎస్ గట్టిగా నిలబడటం వల్లే ఇవాల బాధిత బాలికకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన కేసుల్లో నిందితులను కాపాడాలని చూసే వారికి కేంద్ర క్యాబినెట్లో కొనసాగే అర్హత లేదని, అందుకే బండి సంజయ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read: బండి సంజయ్ కొంపముంచిన సొంత ముఠా.. భగీరథ కేసులో అసలు గుట్టు ఇదే!
కేంద్రమంత్రి బండిసంజయ్ ను బర్తరఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్
బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు: కేటీఆర్
బాలికకు న్యాయం జరగాలని నిలబడి పోరాడింది BRS పార్టీయే: కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని యత్నించాయి: కేటీఆర్
బీఆర్ఎస్ వల్లే బాధిత… pic.twitter.com/C8qrCEN8U4
— BIG TV Breaking News (@bigtvtelugu) May 17, 2026