E-Paper
Advertisement

బండి సంజయ్‌ టార్గెట్‌గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి పదవి ఊడాల్సిందే!

బండి సంజయ్‌ టార్గెట్‌గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి పదవి ఊడాల్సిందే!
Advertisement

KTR Demand: కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక మైనర్ బాలికకు తీవ్ర అన్యాయం జరిగితే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఈ కేసులో బాధిత బాలికకు న్యాయం జరగాలంటూ మొదటి నుండి గళమెత్తి, అండగా నిలబడి పోరాడింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేతులు కలిపి బాధిత బాలికకు అన్యాయం చేయాలని చూశాయని ఆయన ఆరోపించారు. ఒకవైపు కేంద్రమంత్రి, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ఈ పోక్సో (POCSO) కేసును పూర్తిగా నీరుగార్చేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. సమాజంలో తలదించుకునేలా చేసిన నిందితుడిని ఇన్నాళ్లపాటు వెనకేసుకొచ్చి, దాచిపెట్టింది స్వయంగా కేంద్రమంత్రే కాదా? అని కేటీఆర్ నిలదీశారు.

Advertisement

ఈ కేసులో అధికార, ప్రతిపక్షాలు ఎంత నొక్కేయాలని చూసినా బీఆర్ఎస్ గట్టిగా నిలబడటం వల్లే ఇవాల బాధిత బాలికకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన కేసుల్లో నిందితులను కాపాడాలని చూసే వారికి కేంద్ర క్యాబినెట్‌లో కొనసాగే అర్హత లేదని, అందుకే బండి సంజయ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read: బండి సంజయ్ కొంపముంచిన సొంత ముఠా.. భగీరథ కేసులో అసలు గుట్టు ఇదే!

Advertisement

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×