E-Paper
Advertisement

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు
Advertisement

CM Revanth Reddy: 2034 వరకూ ప్రజా ప్రభుత్వానిదే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు పునరుద్ఘటించారు. బీఆర్ఎస్ కు గతమే ఉందన్న ఆయన.. భవిష్యత్తు మాత్రం ప్రజా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ఘట్కేసర్ లో అందేశ్రీ స్మృతి వనం శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అందెశ్రీ తనకు ఆత్మబంధువని, తన రాజకీయ ప్రయాణానికి ఆయనొక స్ఫూర్తి అని పేర్కొన్నారు.

ఉద్యమ గీతాలతో తెలంగాణలో చైతన్యం నింపిన మహాకవి అందెశ్రీ అని రేవంత్ కొనియాడారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గత పాలకులు కుట్రపూరితంగా అణిచివేయాలని చూశారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి బడిలో, ప్రతి గడపలో అందెశ్రీ గీతం మార్మోగుతోందని పేర్కొన్నారు. ఆత్మగౌరవంతో దొరల గడప తొక్కని వ్యక్తి అందెశ్రీ అని రేవంత్ గుర్తు చేశారు. గద్దర్, అందెశ్రీ వంటి ఉద్యమకారులను అవమానించిన రోజే పాత పాలనకు ప్రజలు ముగింపు పలికారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీలే స్ఫూర్తి అని రేవంత్ అన్నారు.

Advertisement

సరూర్ నగర్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన యువజన సభ పై ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పందించారు. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజం వారి దోపిడీని ఇంకా మరిచిపోలేదన్నారు. గజ్వేల్‌లో మీ రాజకీయ సమాధి తవ్వేది తెలంగాణ యువతే అంటూ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు మాయగాళ్ల మాటలు నమ్మొద్దన్నారు. ప్రతి ఖాళీని భర్తీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Also Read: ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

Advertisement

గత ప్రభుత్వం పేపర్ లీకేజీలతో యువత భవిష్యత్తును నాశనం చేసిందని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. తాము అడ్డంకులు తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఏడాదిలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పునరుద్ఘటించారు. ఎల్‌బీ స్టేడియం, శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందించి తల్లిదండ్రుల ఆనందం చూశామన్నారు. పదేళ్లు నోటిఫికేషన్లు ఇచ్చినా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారని బీఆర్ఎస్ ను రేవంత్ ప్రశ్నించారు. మరోవైపు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలు, కోదండరాం వంటి ఉద్యమకారులను తమ ప్రభుత్వం గౌరవించిందని.. 9 మంది కవులను కోటి రూపాయల నగదు బహుమతితో సత్కరించామని సీఎం రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Also Read: ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×