E-Paper
Advertisement

Suicide: ల్యాండ్ డీల్‌లో సీఐ టార్చర్.. బాధితుడు సూసైడ్..

Suicide: ల్యాండ్ డీల్‌లో సీఐ టార్చర్.. బాధితుడు సూసైడ్..
suicide

Suicide: ల్యాండ్ డీల్‌లో నష్టమొచ్చింది.. నువ్వే చెల్లించాలంటూ ఒత్తిడి తేవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నంలో బొడిగే శ్యామ్ అలియాస్ సాంబయ్య సూసైడ్ తీవ్ర కలకలం రేపుతోంది. తన చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిఐ గోపీ కారణం అంటూ నోట్ రాసిపెట్టాడు.

భూపాలపట్నంలో 20 గుంటలు భూమిని ఇంటలిజెన్స్ సిఐ గోపీకి అమ్మించాడు శ్యామ్ గౌడ్ అలియాస్ సాంబయ్య. ఆ 20 గుంటల భూమిని 50 లక్షలకు కొన్నాడు సదరు సిఐ. దానిపై 10 లక్షలు లాభం వస్తుందని ఆ సమయంలో శ్యామ్ చెప్పాడు. అయితే, రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గిపోవడంతో ప్లాట్లు అమ్ముడుపోలేదు. దీంతో.. తనకు వస్తుందని చెప్పిన పది లక్షల లాభం నువ్వే చెల్లించాలంటూ సదరు సీఐ వేధించినట్టు శ్యామ్ తన డైరీలో రాశాడు. ఇప్పటికే ఆరు లక్షలు చెల్లించానని.. మిగతా నాలుగు లక్షల కోసం వేధిస్తున్నాడంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడంటూ.. కొన్ని ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేశాడు శ్యామ్. నువ్వు చస్తే నీ భార్యా బిడ్డలు బిచ్చమెత్తుకుంటారు తప్ప.. నాకేంటి అంటూ ఆ ఆడియోలో అవతలి వ్యక్తి మాట్లాడాడు. నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటా.. నా భూమిని అమ్ముకుంటా అంటూ నిర్దాక్షిణ్యంగా మాట్లాడాడు. నువ్వు చస్తానంటే నేను సహకరిస్తానంటూ చెప్పడంతో మనస్తాపం చెందిన శ్యామ్.. ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×