Ponnam Prabhakar: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేల ఆషాఢ మాస బోనాల పండుగ భాగ్యనరంలో అందగరగ వైభవంగా జరుగుతుది. రాష్ట్ర సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భాగ్యనగర వీధులన్నీ పోతురాజుల నృత్యాలు, శివసత్తుల ఆటలతో మారు మ్రోగుతున్నాయి.
ఊరేగింపులో భాగంగా మంత్రి పోన్నం ప్రభాకర్ మాస్ స్టెప్పులు వేసారు. మంత్రి పోన్నం డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి కొండా సురేఖ, మెట్టు సాయికుమార్ తో పాటు కొంత మంది కాంగ్రెస్ నాయకుల మద్య మంత్రి పొన్నం డప్పులు వాయిస్తూ చిందులు వేశారు.
Also read: దారుణం.. కారుకు అడ్డంగా నిలబడ్డాడని యూ టర్న్ తీసుకుని వచ్చి మరీ కారుతో ఢీకొట్టి హత్య
తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాల ఉత్సవాలను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తుల నమ్మకాలకు, సంప్రదాయాలకు ఎక్కడా భంగం కలగకుండా ఉత్సవాలను విజయవంతం చేయడానికి రూ.20 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర ప్రజలకు, భక్తులకు ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరియు బోనాల పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీక అని సీఎం రేవంత్ కొనియాడారు. ప్రజలందరూ పండుగలో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశిస్సులు పోందుకోవాలని సీఎం తెలిపారు.
Also Read: ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నారా? మీ ఫోన్ సేఫేనా? నిపుణులు ఏమంటున్నారంటే!