E-Paper
Advertisement

Kavitha : విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత మెయిల్..

Kavitha : విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత మెయిల్..
Advertisement

Kavitha : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి ఎమ్మెల్సీ కవిత మెయిల్ చేశారు.సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విచారణకు రాలేనని పేర్కొన్నారు. తనను ఇంటి వద్దే విచారించాలని గతంలో కవిత సుప్రీంలో పిటిషన్‌ వేశారు. అది పెండింగ్‌లో ఉండగానే.. విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపడంతో.. రాలేనంటూ కవిత జవాబిచ్చారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో గతేడాది మార్చిలో కవితను ఈడీ ప్రశ్నించింది. విచారణలో కవిత తన 8 ఫోన్లను ఈడీకి ఇచ్చారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్‌ చేశారు. ఇదే కేసులో నిందితుడైన అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. తాజాగా రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. అంతకుముందే శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారారు. మరోవైపు లిక్కర్‌ స్కామ్‌లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో ఈడీ, సీబీఐ కవిత పేరును ప్రస్తావించాయి.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×