Pradeep Machiraju: తెలుగు బుల్లితెరపై మేల్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన మార్క్ టైమింగ్తో కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్న ప్రదీప్, మధ్యలో హీరోగా మారి వెండితెరపైకి అడుగుపెట్టారు. అయితే, కొద్దిరోజుల గ్యాప్ తర్వాత మళ్లీ తన సొంత గూడైన బుల్లితెరకే పరిమితమవుతూ వరుస షోలకు హోస్టింగ్ చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ప్రదీప్ ఇక వెండితెరకు దూరమైపోయినట్లేనా? బుల్లితెరకే పరిమితమవుతున్నారా? ఆ వివరాలు చూద్దాం..
ప్రదీప్ మాచిరాజు అంటేనే టైమింగ్, కామెడీ కింగ్. గతంలో ఈటీవీలో ‘ఢీ’ లాంటి బ్లాక్బస్టర్ షోలతో అలరించిన ప్రదీప్, చాలాకాలం తర్వాత మళ్లీ అదే ఈటీవీలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇప్పటివరకు రష్మీ గౌతమ్ హోస్ట్ చేసిన ఈ క్రేజీ షో బాధ్యతలను ఇప్పుడు ప్రదీప్ తన చేతుల్లోకి తీసుకున్నారు. రాబోయే ఆదివారం నుంచి ఎంటర్టైన్మెంట్ త్రిబుల్ ఉండబోతోందంటూ విడుదలైన కొత్త ప్రోమో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రష్మీ స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రదీప్ రావడం బుల్లితెరపై సరికొత్త జోష్ నింపింది. ఇక రష్మీ ను పంపించేశారు.. ఇంద్రజ కూడా వెళ్లిపోయింది. ఇంద్రజ స్థానంలో అలనాటి నటి మహేశ్వరి సందడి చేశారు.
’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో ప్రదీప్ మాచిరాజు హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ పాటలు, ఆయన నటన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో వెండితెరపై వరుస ప్రాజెక్టులు చేసేకంటే, తనను ఆదరించిన బుల్లితెరపైనే మళ్లీ బిజీ అవ్వాలని ప్రదీప్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ‘కుకు విత్ జాతిరత్నాలు’ షోకి కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
also read:హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!
చాలామంది నటులు సినిమాల్లో బిజీ అవ్వగానే బుల్లితెరకు బై-బై చెప్పేస్తుంటారు. కానీ ప్రదీప్ మాత్రం తన మూలాలను మర్చిపోకుండా, బుల్లితెర ప్రేక్షకులకు ఎప్పుడూ అందుబాటులో ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. అయితే దీనర్థం ఆయన వెండితెరకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసినట్లు కాదు. మంచి కథ, పవర్ ఫుల్ క్యారెక్టర్ దొరికితే ఆయన తప్పకుండా మళ్లీ వెండితెరపై మెరుస్తారు. ఇక అంతవరకు తన కామెడీ టైమింగ్తో టీవీ స్క్రీన్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు.
పరిశ్రమ ఏదైనా, ప్లాట్ఫామ్ ఏదైనా ప్రేక్షకులను నవ్వించడమే ప్రదీప్ ప్రధాన లక్ష్యం. ఒక వైపు కమెడియన్లు, జడ్జీలతో కూడిన ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీకి ప్రదీప్ హోస్టింగ్ తోడవడంతో షో రేటింగ్స్ సరికొత్త రికార్డులను తాకడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా అవకాశాలు పక్కన పెట్టి మళ్లీ బుల్లితెరను ఏలడానికి వచ్చిన ప్రదీప్ మాచిరాజుకు బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.