Nizam College : నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్ధినులకు హాస్టల్స్ కేటాయించాలని ఏబీవీపీ కార్యకర్తలు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీసింది. హాస్టల్స్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు.. బషీర్బాగ్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అలెర్ట్ అయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, విద్యార్ధి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురి విద్యార్ధులకు గాయాలయ్యాయి. 10 రోజులుగా విద్యార్ధులు దర్నాలు చేస్తున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని విద్యార్థి నేతలు మండిపడ్డారు. విద్యార్ధులు జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్, ఉస్మానియా వీసీ చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.