E-Paper
Advertisement

Owaisi speech in Parliament : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

Owaisi speech in Parliament : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
Asaduddin Owaisi latest news

Asaduddin Owaisi latest news(Telangana today news) :

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే డిమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో వచ్చింది. అప్పట్లో సీమాంధ్ర నాయకులు ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అలాగే భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిని చేయాలని డిమాండ్ ఉంది. దేశ రాజధాని ఢిల్లీ ఉత్తర భారత్ లో ఉంది. అందుకే దేశానికి దక్షిణాదిలో రెండో కేపిటల్ ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రక్షణ కోసం వ్యూహాత్మకంగా మరో రాజధాని ఉండాలని మేధావులు చెబుతున్నారు. అలాంటి సమయాల్లో హైదరాబాద్ పేరే వినిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అలాగే బెంగళూరు, చెన్నై, ముంబై కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రాంతీయ పార్టీలను అసదుద్దీన్‌ ఒవైసీ హెచ్చరించారు.

ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లు ద్వారా గౌరవసభ హోదాను ఎన్డీఏ ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు.

బీజేపీ, ఆప్ మధ్య రాజకీయ పోరాటాన్ని పార్లమెంట్ వెలుపల చూసుకోవాలని కేంద్రానికి ఒవైసీ సూచించారు. కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల థింక్‌ ట్యాంక్‌ నుంచే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు. ఆయన కేంద్రం మనిషేనని ఆరోపించారు. బీజేపీ అధికారంలో లేనప్పుడు కేజ్రీవాల్ ను ఆ స్థానంలో ఉంచాలనుకుంటోందని ఒవైసీ విమర్శలు చేశారు.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×