E-Paper
Advertisement

‘అప్పుడు నీ బుద్ధి ఏమైంది?’.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు!

‘అప్పుడు నీ బుద్ధి ఏమైంది?’.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు!
Advertisement

Ponguleti Srinivas Reddy: మాజీ మంత్రి హరీశ్‌రావుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పేనని, అలాంటప్పుడు తన మామ భూముల విషయంలో రిజిస్ట్రేషన్‌ ఎలా జరిగిందని హరీశ్‌రావును ప్రశ్నించారు. ‘అప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది?’ అని మంత్రి పొంగులేటి ఘాటుగా ప్రశ్నించారు.

బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన పొంగులేటి.. తన మామ భూములకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఎన్‌ఓసీ ఇచ్చిందన్న హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించారు. అసైన్డ్‌ భూములకు అనుమతి ఇవ్వడం చట్టబద్ధం కాదని, ఏ ప్రభుత్వం అలా చేసినా తప్పేనని అన్నారు. ఆ విషయం హరీశ్‌రావుకు తెలియదా? అని ప్రశ్నించారు. అటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూదాన్‌ భూమిని నకిలీ ఎన్‌ఓసీతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని పొంగులేటి ఆరోపించారు. అది కూడా తప్పేనని అన్నారు.

Advertisement

మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ విషయంలోనూ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్‌ జరిగిందని పొంగులేటి తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఏ సర్కార్‌ రిజిస్ట్రేషన్‌ చేసినా అది తప్పేనని స్పష్టం చేశారు. 22ఏ నిషేధిత జాబితాపైనా పొంగులేటి కీలక వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో ఉన్న భూముల్లో సుమారు నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే పట్టా భూములని, మిగిలిన భూమంతా ప్రభుత్వ భూమేనని తెలిపారు.

Also Read: గజం ఎక్కువ ఉన్నా.. ప్రభుత్వానికే భూమి ఇస్తా.. కవిత ఓపెన్ ఛాలెంజ్!

Advertisement

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి 47,440 ఎకరాలు తగ్గించామని పొంగులేటి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడతామని హెచ్చరించారు. 22ఏ భూముల వ్యవహారంపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయాలు తీసుకోనుందని స్పష్టం చేశారు.

Also Read: కవితను చూస్తే పాపం అనిపిస్తోంది.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్

Tags

Related News

2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ

జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!

దానం నాగేందర్ సీటుకు ఎసరు? హైకోర్టు తీర్పుపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనం!

అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!

ఖైరతాబాద్‌కు ఆ పేరు పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి

గజం ఎక్కువ ఉన్నా.. ప్రభుత్వానికే భూమి ఇస్తా.. కవిత ఓపెన్ ఛాలెంజ్!

Big Stories

Advertisement
×