E-Paper
Advertisement

Ponguleti : ఖమ్మంలో పొలిటికల్ హీట్.. పోస్టర్ల కలకలం.. పొంగులేటి అనుచరులకు వార్నింగ్..

Ponguleti : ఖమ్మంలో పొలిటికల్ హీట్.. పోస్టర్ల కలకలం.. పొంగులేటి అనుచరులకు వార్నింగ్..
Advertisement

Ponguleti: ఖమ్మం బహిరంగ సభ నేపథ్యంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అనుచరులు భారీగా ఆయన వెంటనే పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటికి వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

ఖబడ్దార్‌ పొంగులేటి అంటూ ఖమ్మంలోని మమత హాస్పిటల్‌ ఏరియాలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా పోస్టర్లలో రాశారు. పొంగులేటి అనుచరులు మువ్వా విజయ్ బాబు, కార్తీక్ ను ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌ సభకు ఒకరోజు ముందు వార్నింగ్ లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పువ్వాడ అజయ్ కుమార్ కాళ్లు పట్టుకుని మువ్వా విజయ్ బాబు క్షమాపణ చెప్పకపోతే శవాలు కూడా దొరకవంటూ పోస్టర్లలో రాయడం అలజడి రేపుతోంది.

Advertisement

పోస్టర్ల ఏర్పాటుపై పొంగులేటి స్పందించారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నందునే బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన అనుచరులను చంపి శవాలు కూడా లేకుండా చేస్తామని వార్నింగ్ ఇవ్వడంపై భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ జనగర్జన సభ ముగిసే వరకు మంచి నీళ్ల సరఫరా బంద్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఖమ్మంలో కాంగ్రెస్ సభను విజయవంతం చేసి తీరుతామని పొంగులేటి స్పష్టం చేశారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×