E-Paper
Advertisement

Priyanka Gandhi speech: పోడు పట్టాలు ఇవ్వకుండా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారు : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi | అదివాసీలు, గిరిజనుల అభివృద్థి కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసగించారు. ఈ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గిరిజనులు, ఆదివాసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని.. అదే విధంగా గిరిజనుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

Priyanka Gandhi speech: పోడు పట్టాలు ఇవ్వకుండా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారు : ప్రియాంక గాంధీ
Priyanka Gandhi latest speech

Priyanka Gandhi latest speech(TS politics):

అదివాసీలు, గిరిజనుల అభివృద్థి కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసగించారు. ఈ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గిరిజనులు, ఆదివాసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని.. అదే విధంగా గిరిజనుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

ఇందిరాగాంధీ రాజకీయాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమే చేశారని.. అందుకే ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ 40 ఏళ్ల మరణించినా.. ఆమెను ప్రజలు ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటున్నారని అన్నారు. అలాగే సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ తెలంగాణలో నిరంకుశ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. పోడు పట్టాల ఇవ్వకుండా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పదేళ్లుగా కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నా.. ప్రజలు ఇంకా వెనుకబడే ఉన్నరని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల జీవితాలు మారుతాయని.. ఉద్యమకారులు ఎన్నో కలలు కన్నారు కానీ అటువంటిదేమీ జరగలేదని విమర్శించారు. తెలంగాణ యువతకు కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా… వారి జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. అదే కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగరికి ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికలలో గెలిస్తే.. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీలో వైఫల్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జాబ్ కావాలంటే ముందు బీఆర్ఎస్ పోవాలని.. కేసీఆర్ ఫ్యామిలీ ఉద్యోగాలను పీకేయాలని ఆమె అన్నారు. ఎన్నికల్లో యువత ఆ పని చేస్తే నిరుద్యోగులకు తప్పకుండా కొలువులొస్తాయని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×