E-Paper
Advertisement

Mancherial : అప్పుడు అభిమానం.. ఇప్పుడు ఆగ్రహం.. అమ్మకానికి కేసీఆర్ గుడి

Mancherial : అప్పుడు అభిమానం.. ఇప్పుడు ఆగ్రహం.. అమ్మకానికి కేసీఆర్ గుడి
Advertisement

Mancherial : ఆనాడు అభిమానం, ఈనాడు ఆగ్రహం.. అప్పట్లో గుడి కట్టి విగ్రహం, ఇప్పడు తిట్ల దండకం. అవును ఒకప్పుడు తనంటే ఎనలేని అభిమానం. అందుకే పాలరాతితో గుడికట్టి తన అభిమానాన్ని చాటిన వ్యక్తే.. ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఆ విగ్రహాన్నే అమ్మేస్తానని బేరానికి పెట్టాడు.

మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కేసీఆర్‌ వీరాభిమాని నిప్పులు చెరుగుతున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు ఒకప్పుడు తన ఇంటి వద్ద పాలరాతితో గుడికట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు గుండ రవీందర్‌. అయితే,.. సీఎంగా కేసీఆర్‌ ప్రజలను పట్టించుకోవడం లేదని.. తనకు కష్టమొచ్చిందని ప్రగతి భవన్‌ వరకు వెళ్లినా ఎలాంటి స్పందన లేదని మండిపడుతున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం రెండెకరాలు భూమిని అమ్ముకుని నష్టపోయాయని.. కేబుల్‌ పేరుతో తనను ఇబ్బందులు పెడుతున్నా ఆ గోడు వినడానికి దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ విగ్రహాన్ని అమ్మకానికి పెడ్తూ అందుకు సంబంధించిన ఫ్లెక్సీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ అంశం చర్చకు దారి తీసింది.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

Big Stories

Advertisement
×