E-Paper
Advertisement

Revanth Reddy: రూ.1000 కోట్ల ORR స్కాం.. ఆ ముగ్గురే కారణమన్న రేవంత్..

Revanth Reddy: రూ.1000 కోట్ల ORR స్కాం.. ఆ ముగ్గురే కారణమన్న రేవంత్..

Revanth Reddy: వేలకోట్ల ఆదాయం వచ్చే ఔటర్‌ రింగ్‌ రోడ్డును కేసీఆర్‌ ఓ ప్రైవేట్‌ సంస్థకు తాకట్టు పెట్టారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. 30వేల కోట్ల ఆదాయం వచ్చే ఔటర్‌ ను 7వేల380 కోట్లకు తాకట్టు పెట్టడం వెనక పెద్ద కుంభకోణం ఉందన్నారు. దాదాపుగా వెయ్యి కోట్లు చేతులు మారాయన్నారు రేవంత్‌రెడ్డి.

భాగ్యనగరానికి మణిహరంలా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందన్నారు పీసీసీ చీఫ్. ఈ కుంభకోణం వెనక సోమేశ్‌ కుమార్‌, అరవింద్‌ కుమార్‌, మంత్రి కేటీఆర్‌ ఉన్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని రేవంత్‌ తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామన్నారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఓఆర్ఆర్‌ను తాకట్టు పెట్టడంపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్‌, కిషన్ రెడ్డిలు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×