BigTV English

hyderabad express : రైళ్లే టార్గెట్.. అర్ధరాత్రి దోపిడి..

hyderabad express : రైళ్లే టార్గెట్.. అర్ధరాత్రి దోపిడి..

hyderabad express : ఘరానా దొంగలు రైళ్లను టార్గెట్ చేస్తున్నారు. దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవలకాలంలో ఇలాంటి నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి ప్రయాణికులు గాఢ నిద్ర ఉన్న సమయంలో హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లోకి చొరబడ్డారు. ప్రయాణికులు తేరుకునే లోపు బంగారు తీసుకుని పారిపోయారు.


నెల్లూరు జిల్లా ఉలవపాడు- తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య దొంగలు చోరీకి పాల్పడ్డారని రైల్వే పోలీసులు తెలిపారు. ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆరుగురు దుండగులు నిలిపివేశారు. ఆ తర్వాత నిందితులు ఎస్‌-1, ఎస్‌-2, ఎస్‌-3 బోగీల్లోకి చొరబడ్డారు. మహిళల మెడల్లోని 30 తులాల బంగారాన్ని అపహరించారు.

ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్నచార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ దోపిడీకి దుండగులు ప్రయత్నించారు. ఆ రైలును తెట్టు సమీపంలో నిలిపివేశారు. రైలులోకి ప్రవేశించి చోరికి పాల్పడేందుకు ప్రయత్నించారు. రైలులో భద్రతా ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై రాళ్లు రువ్వి దుండగులు పరారయ్యారు. ఆ తర్వాత చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్కడ నుంచి చెన్నైకి వెళ్లింది. ప్రయాణికుల ఫిర్యాదుతో ఒంగోలులో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు.


ఇటీవల కాలంలో రైళ్లు నేరాలకు కేంద్రాలకు మారుతున్నాయి. దోపిడి దొంగలు ప్రయాణికులపై దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. ఇలాంటి ఘటనలతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×