E-Paper
Advertisement

Cantonment BJP Candidate: బీజేపీ అభ్యర్థి తిలక్, గట్టి పోటీ తప్పదా?

Cantonment BJP Candidate: బీజేపీ అభ్యర్థి తిలక్, గట్టి పోటీ తప్పదా?

Secunderabad Cantonment BJP Candidate(BJP news in telangana): ఎట్టకేలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. అన్నికోణాల్లో పరిశీలించి డాక్టర్ టీఎన్ వంశా తిలక్ పేరును ఖరారు చేసింది. తొలుత ఈ సీటు నుంచి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయడం బీజేపీకి కత్తిమీద సాముగా మారింది. రెండుసార్లు పోటీ చేసిన శ్రీగణేష్.. కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో కొత్త అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది.

ఈ సీటు కోసం బీజేపీ నుంచి దాదాపు 10 మంది పోటీపడ్డారు. చివరకు అన్నికోణాల్లో పరిశీలించి చివరకు డాక్టర్ వంశా తిలక్ పేరును ఫైనల్ చేసింది. తెలంగాణకు చెందిన కమలనాథులు ఆయన పేరు హైకమాండ్‌కు ఇవ్వడం, ఓకే చేయడం చకచకా జరిగిపోయింది.

గతంలోకి వెళ్తే.. మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ వంశా తిలక్. ఈమె బొల్లారం ప్రాంతానికి చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భర్త నారాయణ ఎనిమిదేళ్ల కిందట పద్మశ్రీ అవార్డును అందు కున్నారు. వీరి వారసుడే డాక్టర్ వంశా తిలక్. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుటి నుంచి ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఆయనకు సాధ్యం కాలేదు. చివరకు బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో తిలక్‌కు సీటు లభించింది. స్వతహాగా తిలక్ డాక్టర్ కావడం, పార్టీలో ఉండడం కూడా కలిసివచ్చిన అంశంగా పార్టీ నేతలు చెబుతున్నారు.

ALSO READ: రద్దీగా వైన్ షాపులు, 24 గంటలపాటు బంద్

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన శ్రీ‌గణేష్.. ఈసారి హస్తం పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ఈసారి కచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య సోదరి నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. ఫ్యామిలీ సెంటిమెంట్ తనకు కలిసొస్తుందని నివేదిత ఆలోచన. మొత్తానికి ఈసారి పోటీ గట్టిగా ఉంటుందని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. మే 13న లోక్‌సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది.
Tags

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×