Secunderabad Cantonment BJP Candidate(BJP news in telangana): ఎట్టకేలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. అన్నికోణాల్లో పరిశీలించి డాక్టర్ టీఎన్ వంశా తిలక్ పేరును ఖరారు చేసింది. తొలుత ఈ సీటు నుంచి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయడం బీజేపీకి కత్తిమీద సాముగా మారింది. రెండుసార్లు పోటీ చేసిన శ్రీగణేష్.. కాంగ్రెస్లో చేరిపోయారు. దీంతో కొత్త అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది.
ఈ సీటు కోసం బీజేపీ నుంచి దాదాపు 10 మంది పోటీపడ్డారు. చివరకు అన్నికోణాల్లో పరిశీలించి చివరకు డాక్టర్ వంశా తిలక్ పేరును ఫైనల్ చేసింది. తెలంగాణకు చెందిన కమలనాథులు ఆయన పేరు హైకమాండ్కు ఇవ్వడం, ఓకే చేయడం చకచకా జరిగిపోయింది.
గతంలోకి వెళ్తే.. మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ వంశా తిలక్. ఈమె బొల్లారం ప్రాంతానికి చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా పనిచేశారు. తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భర్త నారాయణ ఎనిమిదేళ్ల కిందట పద్మశ్రీ అవార్డును అందు కున్నారు. వీరి వారసుడే డాక్టర్ వంశా తిలక్. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుటి నుంచి ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఆయనకు సాధ్యం కాలేదు. చివరకు బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో తిలక్కు సీటు లభించింది. స్వతహాగా తిలక్ డాక్టర్ కావడం, పార్టీలో ఉండడం కూడా కలిసివచ్చిన అంశంగా పార్టీ నేతలు చెబుతున్నారు.
ALSO READ: రద్దీగా వైన్ షాపులు, 24 గంటలపాటు బంద్