E-Paper
Advertisement

Software Surender Kidnap: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

Software Surender Kidnap: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Advertisement

Software Surender Kidnap: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ అంశం సంచలనంగా మారింది. ఈ కిడ్నాప్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం సాయంత్రం ఖాజాగూడ చెరువు వద్ద తన చెల్లితో మాట్లాడుతుండగా సురేందర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే.. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కిడ్నాప్ లో బాధితుడి చెల్లెలు పాత్ర ఉందని తేల్చారు.

సురేందర్ ను స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్‌ చేసిన తర్వాత సురేందర్‌ ముఖానికి మాస్క్ వేసి నంద్యాలకు తీసుకెళ్లారు. అయితే నంద్యాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర.. పోలీసులు తనిఖీలు చేసినపుడు సురేందర్ మాస్క్ తొలగించారు. ముఖంపై గాయం ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించారు. కిడ్నాపర్లు పొంతన లేని సమాధానాలు మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దీంతో.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయడంతో కిడ్నాప్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. నంద్యాల చెక్ పోస్టు వద్దే ఇద్దరు నిందితులు పట్టుపడ్డారు.

Advertisement

విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు నంద్యాలకు వెళ్లి వారిని తీసుకొచ్చారు. ఈ దారుణానికి పాల్పడింది సురేష్ అండ్ గ్యాంగ్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నలుగురు కిడ్నాపర్లు ఉన్నారు. కిడ్నాప్‌కు సూత్రధారిగా ఉన్న సురేష్‌ అనేక కిడ్నాప్‌ కేసులలో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అటు.. ఈ తతంగం అంతా నడిపించింది కిడ్నాప్‌కు గురైన సురేందర్ చెల్లెలు అని పోలీసులు తేల్చారు.

.

Advertisement

.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×