BigTV English

HYDERABAD: స్పౌజ్ టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్!

HYDERABAD: స్పౌజ్ టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్!

HYDERABAD: 13 జిల్లాల్లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ దంపతులు ఆందోళనకు దిగారు. లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట పిల్లలతో కలిసి మౌనదీక్ష చేపట్టారు. వెంటనే పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


మొత్తం 1656 మందికి దంపతుల బదిలీలు నిర్వహించేందుకు ఫైల్ సిద్ధమైనప్పటికీ.. కేవలం 615 మందిని మాత్రమే బదిలీ చేయాలనుకోవడం దారుణమని అన్నారు. పూర్తిగా అర్హత ఉన్న క్యాడర్లను పక్కన బెట్టి 30శాతం దంపతుల బదిలీలు చేపట్టడంతో మిగతా వారి కుటుంబాల్లో ఆవేదన మిగిలిందని వాపోయారు.

అయితే వందలాదిగా ఉపాధ్యాయులు తరలిరావడంతో కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మెహరించి ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. టీచర్ల వెంట ఉన్న వారి పిల్లలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×